Madhyapradesh : నిత్య పెళ్లికూతురు.. ఆరుగురిని చేసుకుని ఏడో వాడితో పెళ్లికి రెడీ అయింది..కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని హర్దాలో పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికూతురును పోలీసులు అరెస్ట్ చేశారు. వధువుకు ఇది ఏడో పెళ్లి అని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు ఆరుగురిని పెళ్లాడిన తర్వాత రాత్రికి రాత్రే వారిని దోచుకుని పారిపోయింది. మంటపంపై కూర్చున్న వరుడికి ఈ విషయం తెలియడంతో అతను స్పృహ కోల్పోయాడు. అతను తన భార్యకు ఏడవ భర్తగా మారబోతున్నానని ఊహించలేకపోయాడు. ఇంతకు ముందు కూడా దొంగ పెళ్లికూతుళ్ల ముఠా గుట్టు రట్టు అయింది. హర్దా ఎస్పీ అభినవ్ చౌక్సే ఈ విషయాన్ని వెల్లడించారు.
వధువు అనిత జూన్ 24న హర్దా యువకుడు అజయ్ పాండేని వివాహం చేసుకుంది. జూన్ 30వ తేదీన వధువు తన భర్తతో కలిసి హార్దాలోని పార్కుకు వచ్చి తనకు ఆకలిగా ఉందని భర్త అజయ్తో చెప్పింది. భర్త అజయ్ కొన్ని ఆహార పదార్థాలు కొనేందుకు వెళ్లాడు. ఈ సమయంలో వధువు అనిత అదృశ్యమైంది. అజయ్ ఆమె కోసం వెతికినా ఎక్కడా కనిపించలేదు. అతను ఫోన్ చేయగా అనిత ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అనిత కుటుంబీకులకు ఫోన్ చేయగా అక్కడి నుంచి కూడా ఎవరూ స్పందించలేదు. బహుశా అనితను కిడ్నాప్ చేసి ఉంటాడని అజయ్ అనుకున్నాడు.
Also Read
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Read Also:Foldable iPhone:యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది!
వధువు కనిపించడం లేదని బాధిత యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు, అజయ్ను దొంగ పెళ్లికూతురు ముఠా మోసం చేసి ఉంటుందని వారు అనుమానించారు. అనిత కిడ్నాప్ జరగలేదు. పోలీసులు అజయ్ని ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అని ప్రశ్నించారు. అప్పుడు అజయ్.. సార్, నేను పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నాను. అప్పుడు రాంభరోస్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించాడు. తన దత్తత తీసుకున్న మేనకోడలు అనిత కోసం వరుడిని కూడా వెతుకుతున్నట్లు చెప్పారు. వారిది పేద కుటుంబం అన్ని చెప్పాడు. ఆమె మీరు రూ. 1 లక్ష సాయం చేస్తే బాగుంటుందని చెప్పాడు. నేను అతని అభ్యర్థనకు అంగీకరించాను. అనిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశాను. అంతేకాకుండా రూ.90 వేల విలువైన నగలను తయారు చేసి అనితకు ఇచ్చాను. తర్వాత పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అయిన తర్వాత అనిత జూన్ 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందన్నారు.
అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిత, ఆమె కుటుంబ సభ్యుల నంబర్లు తీసుకున్నారు. కాల్ వివరాలు, నిఘా సహాయంతో అనిత ఆచూకీ తెలుసుకున్నారు. ఈ కేసులో దొంగ వధువు అనిత అలియాస్ శివాని దూబే, తల్లి రేఖ, వికలాంగుడైన తండ్రి గజానన్ అలియాస్ కల్లు, అత్త చాందిని, మామ రంభరోస్లను అరెస్టు చేశారు. అనితను అరెస్ట్ చేసినప్పుడు ఆమె పెళ్లికూతురు వేషం వేసింది. ఏడో పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఏడడుగులు వేయకముందే పోలీసులు ఆమెను తన ముఠాను పట్టుకున్నారు. హర్దా నుంచి మోసపోయిన డబ్బు, నగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
దొంగ వధువైన అనిత ముఠా దేవాస్లోని ఖటేగావ్కు చెందినవారు. వారు గుణ, దేవాస్, సెహోర్, హర్దా జిల్లాల్లో మొత్తం 6 మందిని మోసం చేశారు. ఇంతమంది పెళ్లి పేరుతో అడ్వాన్స్గా డబ్బులు తీసుకుని, తర్వాత పెళ్లికూతురు సాకుగా చూపి డబ్బు, నగలతో మాయమయ్యేవారు. దొంగ పెళ్లికూతురు, ఆమె గ్యాంగ్ వివాహం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం వెతుకుతారు. లేదా అతను వయసులో చాలా పెద్దవాడయి ఉండేవాళ్లను టార్గెట్ చేసేవారు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!