IND vs ENG: అంపైర్లు మ్యాచ్ రద్దు ప్రకటించకముందే.. హోటల్కు వెళ్లిపోయిన ప్లేయర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England Warm-Up Match Abandoned Due to Rain: వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్లను వరణుడు అడ్డుకుంటున్నాడు. వరుసగా రెండో రోజూ వాన పడడంతో మ్యాచ్లు సాధ్యం కాలేదు. భారీ వర్షం కారణంగా శనివారం గువాహటిలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి పడకుండానే వార్మప్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు పరిస్థితి బాగానే ఉండటంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ అనంతరం వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.
వర్షం కారణంగా మ్యాచ్ జరగదని భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ముందే హోటల్కు వెళ్లిపోయారు. అధికారికంగా అంపైర్లు ప్రకటించకముందే మైదానం వీడి హోటల్కు వెళ్లారు. ప్రపంచకప్ 2023లో ప్రతి జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. భారత్ తన రెండో సన్నాహక మ్యాచ్ కోసం తిరువనంతపురం ఈరోజు బయల్దేరుతుంది. అక్టోబరు 3న నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. ఇక ఇంగ్లండ్ గువాహటిలోనే తన రెండో ప్రాక్టీస్ను అక్టోబర్ 2న బంగ్లాదేశ్తో ఆడుతుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు శనివారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వాన వల్ల రద్దయింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్ను 23 ఓవర్లకు కుదించగా.. మొదట ఆసీస్ 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 84/6తో ఉన్నప్పుడు వర్షం మళ్లీ మొదలైంది. దాంతో మ్యాచ్ రద్దయింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ప్రపంచకప్ కప్ అసలు సమరం అక్టోబర్ 5న ఆరంభం కానుండగా.. 8న చెన్నైలో ఆస్ట్రేలియాను భారత్ ఢీ కొట్టనుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!