Gurukul Students Missing : వీడిన ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ
- కలకలం రేపిన 6గురు పదో తరగతి విద్యార్థుల అదృశ్య ఘటన
- ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ మద్యం సేవించి హాజరైన విద్యార్థులు
- వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ
- గమనించి మందలించిన ఉపాధ్యాయులు
- మనస్థాపానికి గురై పాఠశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు.
ఉపాధ్యాయుల మందలింపుతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై భయాందోళనకు గురైన గురుకుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు విజయవాడకు వెళ్లినట్లు గుర్తించారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
CM Chandrababu: ‘ఆప్’ పాలనపై ఏపీ సీఎం విమర్శలు
విద్యార్థుల ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే విజయవాడకు వెళ్లి, అదృశ్యమైన భాను ప్రకాశ్, నాగ వంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్లను క్షేమంగా పాఠశాలకు తిరిగి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ అందించి, వారి మానసిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. విద్యార్థులను తిరిగి ఉపాధ్యాయుల , తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విద్యార్థుల రక్షణ కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, భవిష్యత్తులో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ ఘటన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఒక గుణపాఠంగా నిలుస్తుందని, విద్యార్థుల సంక్షేమం కోసం మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..