Road Accident: టెక్సాస్లో గుంటూరు విద్యార్థిని మృతి.. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా..!
- టెక్సాస్లో గుంటూరు విద్యార్థిని మృతి
- రోడ్డుపై నడిచివెళ్తుండగా ఢీకొట్టిన కారు
- చికిత్స పొందుతూ కన్నుమూసిన దీప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందింది. టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మృతి చెందింది. స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు దీప్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని పడింది. శనివారం నాటికి దీప్తి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా దీప్తి మరణించడం ఆమె కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.
గుంటూరు రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటున్న హనుమంతరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమార్తె దీప్తి. పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్లో దీప్తి టాపర్గా నిలవడంతో.. తల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికా పంపారు. కొన్నాళ్ల క్రితం యూఎస్ వెళ్లిన దీప్తి.. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేస్తోంది. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. ఏప్రిల్ 12న స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి దీప్తి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయాలు కాగా.. స్నిగ్ధకు సైతం గాయాలయ్యాయి.
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
Also Read: MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్టన్.. సన్రైజర్స్పై ముంబై విజయం! ప్లేఆఫ్స్ రేసులో ఎంఐ
దీప్తి ఫ్రెండ్స్ ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు చెప్పగా.. మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో సంప్రదించారు. అమెరికాలో ఉన్న పెమ్మసాని విషయం తెలుసుకుని.. తన బృందాన్ని అప్రమత్తం చేసి దీప్తికి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. చికిత్స పొందుతూ ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!