Gujarat: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు. ఆనంద్ జిల్లాలోని చిఖోద్రా గ్రామ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు టైరు పగిలి రోడ్డు పక్కన ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. టైరు మారుస్తున్న సమయంలో బస్సులోని ప్రయాణికులు కిందకు దిగారని, కొందరు వాహనం ముందు వేచి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిందని అధికారి తెలిపారు.
Read Also:Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
#WATCH | Gujarat: Several people injured after a bus collided with a truck on the Ahmedabad-Vadodra Express Highway in Anand, earlier today.
(Source: Fire Department, Anand, Gujarat) pic.twitter.com/JI67jNmhn2
— ANI (@ANI) July 15, 2024
బస్సు మహారాష్ట్ర నుండి రాజస్థాన్ వెళ్తుండగా, ఆనంద్ సమీపంలో బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సు డ్రైవర్, ప్రయాణికులు బస్సు కింద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద వార్త అందిన వెంటనే ఆనంద్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్స్ప్రెస్ హైవే పెట్రోలింగ్ టీమ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, వారి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు జూలై 12న గుజరాత్లోని పటాన్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం గమనార్హం. అప్పుడు కూడా బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Anivara Asthanam: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!