Gujarat: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు. ఆనంద్ జిల్లాలోని చిఖోద్రా గ్రామ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు టైరు పగిలి రోడ్డు పక్కన ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. టైరు మారుస్తున్న సమయంలో బస్సులోని ప్రయాణికులు కిందకు దిగారని, కొందరు వాహనం ముందు వేచి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిందని అధికారి తెలిపారు.
Read Also:Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
#WATCH | Gujarat: Several people injured after a bus collided with a truck on the Ahmedabad-Vadodra Express Highway in Anand, earlier today.
(Source: Fire Department, Anand, Gujarat) pic.twitter.com/JI67jNmhn2
— ANI (@ANI) July 15, 2024
బస్సు మహారాష్ట్ర నుండి రాజస్థాన్ వెళ్తుండగా, ఆనంద్ సమీపంలో బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సు డ్రైవర్, ప్రయాణికులు బస్సు కింద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద వార్త అందిన వెంటనే ఆనంద్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్స్ప్రెస్ హైవే పెట్రోలింగ్ టీమ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, వారి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు జూలై 12న గుజరాత్లోని పటాన్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం గమనార్హం. అప్పుడు కూడా బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Anivara Asthanam: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..