Gujarat: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు. ఆనంద్ జిల్లాలోని చిఖోద్రా గ్రామ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు టైరు పగిలి రోడ్డు పక్కన ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. టైరు మారుస్తున్న సమయంలో బస్సులోని ప్రయాణికులు కిందకు దిగారని, కొందరు వాహనం ముందు వేచి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిందని అధికారి తెలిపారు.
Read Also:Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
#WATCH | Gujarat: Several people injured after a bus collided with a truck on the Ahmedabad-Vadodra Express Highway in Anand, earlier today.
(Source: Fire Department, Anand, Gujarat) pic.twitter.com/JI67jNmhn2
— ANI (@ANI) July 15, 2024
బస్సు మహారాష్ట్ర నుండి రాజస్థాన్ వెళ్తుండగా, ఆనంద్ సమీపంలో బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సు డ్రైవర్, ప్రయాణికులు బస్సు కింద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద వార్త అందిన వెంటనే ఆనంద్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్స్ప్రెస్ హైవే పెట్రోలింగ్ టీమ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, వారి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు జూలై 12న గుజరాత్లోని పటాన్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం గమనార్హం. అప్పుడు కూడా బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Anivara Asthanam: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!