Gujarat: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు. ఆనంద్ జిల్లాలోని చిఖోద్రా గ్రామ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు టైరు పగిలి రోడ్డు పక్కన ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. టైరు మారుస్తున్న సమయంలో బస్సులోని ప్రయాణికులు కిందకు దిగారని, కొందరు వాహనం ముందు వేచి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిందని అధికారి తెలిపారు.
Read Also:Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
#WATCH | Gujarat: Several people injured after a bus collided with a truck on the Ahmedabad-Vadodra Express Highway in Anand, earlier today.
(Source: Fire Department, Anand, Gujarat) pic.twitter.com/JI67jNmhn2
— ANI (@ANI) July 15, 2024
బస్సు మహారాష్ట్ర నుండి రాజస్థాన్ వెళ్తుండగా, ఆనంద్ సమీపంలో బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సు డ్రైవర్, ప్రయాణికులు బస్సు కింద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద వార్త అందిన వెంటనే ఆనంద్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్స్ప్రెస్ హైవే పెట్రోలింగ్ టీమ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, వారి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు జూలై 12న గుజరాత్లోని పటాన్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం గమనార్హం. అప్పుడు కూడా బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Anivara Asthanam: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!