Gujarat Polls: సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అమ్రేలిలో హస్తం పార్టీ ఎమ్మెల్యే పరేశ్ ధనాని.. సైకిల్కి సిలిండర్ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు.
#WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
— ANI (@ANI) December 1, 2022
ఇదిలావుండగా, ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, రాష్ట్ర ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.‘గుజరాత్ సోదర సోదరీమణులందరికీ విజ్ఞప్తి… ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతుల రుణమాఫీ, గుజరాత్ ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయండి’ అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
रोज़गार के लिए
सस्ते गैस सिलेंडर के लिए
किसानों की कर्ज़ा माफी के लिएगुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।#કોંગ્રેસ_આવે_છે
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2022
ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నది. గుజరాత్ నేడు ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటుందని అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ రోజు, డిసెంబర్ 5న జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తరుపున విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి 4.9 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆప్ గుజరాత్ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..