Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Morbi Bridge: గుజరాత్ మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. దాదాపు 141మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. నదిలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఘటనకు కారకులుగా భావిస్తోన్న తొమ్మదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ, టికెట్ కలెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిర్వహణకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపించారు. దీంతో అక్కడ వంతెనను నిర్మిస్తున్న కంపెనీపై నేరపూరిత హత్య కేసు నమోదు చేశారు. ఐజీనీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.
Read Also: Boy Killed Snake: నన్నే కాటేస్తావా..కొరికి చంపుతా.. పాముపై కోపంతో బాలుడు ఏంచేశాడంటే..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
‘ఇది ఇలా ఉండగా.. గుజరాత్ మోర్బీ బ్రిడ్జీ ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.’
Read Also: NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు
గుజరాత్ బ్రిడ్జి ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది మరణించగా.. 177 మందిని రక్షించారు. నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయ, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా మంది మోర్బి నివాసితులు ప్రజలను రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నారు. రక్తదానం చేసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. రక్తదానం చేసేందుకు వస్తున్నవారితో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!