GST Collection : బడ్జెట్కు ముందు ప్రభుత్వానికి శుభవార్త.. జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Collection : బడ్జెట్కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల. జనవరిలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10.4 శాతం పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఒక నెలలో ఇప్పటివరకు ఇది రెండవ అతిపెద్ద కలెక్షన్.
10 నెలల్లో జీఎస్టీ మొత్తం రూ.16.69 లక్షల కోట్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం రూ. 1,72,129 కోట్ల జీఎస్టీ వసూళ్లను పొందింది. జనవరి 2023లో ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం రూ.1,55,922 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2023 – జనవరి 2024 మధ్య వార్షిక ప్రాతిపదికన మొత్తం GST వసూళ్లు 11.6 శాతం పెరిగింది. ఈ 10 నెలల్లో జీఎస్టీ వసూళ్లు ఏడాది క్రితం రూ.14.96 లక్షల కోట్ల నుంచి రూ.16.69 లక్షల కోట్లకు పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైగా రావడం ఇది 12వ నెల.
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
Read Also:CM Revanth Reddy : భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక
ఏప్రిల్ 2023లో అత్యధిక GST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. 2023 ఏప్రిల్లో ఇప్పటివరకు అత్యధిక జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు. జనవరిలో రూ.39476 కోట్ల ఎస్జిఎస్టి, రూ.89989 కోట్ల ఐజిఎస్టి, రూ.10701 కోట్ల సెస్సులు వసూలయ్యాయి. బడ్జెట్కు ముందు వచ్చిన ఈ గణాంకాలు ప్రభుత్వానికి శుభవార్త లాంటివి. జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం నిరంతరం మెరుగుపరుస్తోంది. దీనితో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, పండుగల సీజన్లో అధిక వ్యయం, జీఎస్టీలో ప్రభుత్వం చేసిన సంస్కరణలు వసూళ్లు పెరగడానికి ప్రధానంగా కారణమవుతున్నాయి.
జీఎస్టీ వసూళ్లు చాలా ముఖ్యం
GST వసూళ్లు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. GST నుండి వచ్చిన డబ్బును ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలలో ఉపయోగిస్తారు. ఇది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతం. జీఎస్టీ వసూళ్లు పెరగడం వల్ల ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.
Read Also:Nikhil Siddhartha : ఘనంగా జరిగిన నిఖిల్ భార్య సీమంతం వేడుక.. ఫోటోస్ వైరల్..
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!