జమ్మి మొక్కను నాటిన సీఎం కేసిఆర్, చిన్నజీయర్ స్వామిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ మండలం పరిధిలోని శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితా:” అన్నారు మన పెద్దలు. కానీ, ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ..కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి భూమి గురించి, ప్రకృతి గురించి, సకల చరాచర జీవరాశుల గురించి ఎన్నెన్నో అద్భుతమైన ఉపదేశాలను అందించింది. వాటిని సదా ఆచరించింది. ముఖ్యంగా దైవం మీద ప్రేమ కలిగిన ప్రతీ వ్యక్తి ఏ రూపంలో దేవున్ని ప్రార్ధన చేసినా, ఆ దేవునికి సంబంధించి మన వేదాలు ఒక జంతువును, ఒక పక్షిని, చెట్టును వాటితో దేవుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టంగా వివరించాయి. విష్ణువు తో పాటు అశ్వద్ధామ, పక్షి గరస్మంతుడు, పామును, పరమ శివుడితో పాటు బిల్వపత్రం, నందిని అనుసంధానించారు. అంటే ప్రకృతితో మనిషి జీవం సాగించడానికి ప్రతీరూపంగా భగవంతుడు తన రూపాన్ని ఆవిష్కరించాడని చిన్నజీయర్ స్వామీజీ అన్నారు.
అంతేకాదు, మనమంతా “మానవసేవయే మాధవ సేవ అనుకోకుండా” మాధవ సేవ అనే భావనతో సర్వప్రాణి సేవ చేయాలన్నారు. మనిషి పుట్టినప్పుటి నుంచి కాటికి చేరేదాక చెట్టు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని. అందుకే చెట్లల్లో నీడనిచ్చేవని, కాయలిచ్చేవని, పూలు ఇచ్చేవనే భావన లేకుండా అన్ని మొక్కల్ని పెంచాలి. ఈ భావనలు రాకుడదనే భగవంతుడు జమ్మి చెట్టును మన ఆలోచనలో భాగం చేశాడు. జమ్మి చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవికి ప్రతీరూపంగా భావించేలా చేశాడు. భగవంతుడే జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి ఆరాధన చేసి, తమ ఆయుధాలను చెట్టుపై పెట్టి పూజించి మనకు పండగాలో చెట్టును భాగం చేశాడు. ఈ కారణంగానే పూర్వీకులు జమ్మిని రాణిగా పిలిచారని, దోషాలను శమీంప చేసేదిగా జమ్మికి ప్రాధాన్యత కల్పించారన్నారు. అనాదిగా పూర్వీకులు మనకు అందించిన ఈ గొప్ప సదాశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కోట్లాది మొక్కలను నాటించిన వారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
Also Read
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
హైందవ సంప్రదాయంలో ప్రాధాన్యత కలిగిన జమ్మి చెట్టును జాతీయస్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న వారి ఆశయానికి ఆ శ్రీమన్నారయణమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాదు వారి భవిష్యత్ కార్యక్రమాలు దిగ్విజయం కావాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అనంతరం రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడతూ.. గురుతుల్యురు, సత్పురుషులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటడం మా పూర్వజన్మ సుకృతం. వారి ఆశీస్సులు మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కావేరి సీడ్స్ భాస్కర్ రావు, మై హోమ్స్ రామేశ్వర్ రావుతో పాటు ఆశ్రమానికి చెందిన స్వామిజీలు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!