Increase Retirement Age:గుడ్ న్యూస్.. వారి రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Increase Retirement Age: ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పదవీకాలన్నీ మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ కాలం 60 సంవత్సరాలుగా ఉంది. అయితే వీరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి తెలిసిన వీరి సేవలను మరికొంత కాలం వినియోగించుకుంటే బాగుంటుందని ప్రభుత్వం అనుకుంటుందట. దీంతోనే వారి పదవీవిరమణ వయసును పెంచాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం.
Also Read: Kidnap: బాలుడి కిడ్నాప్.. రాఖీ కట్టించడం కోసం ఇలా కూడా చేస్తారా?
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ఈ నిర్ణయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలం కూడా మరో రెండేళ్లు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 2020 నుంచి ఎస్బీఐ చైర్మన్గా ఖారా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అక్టోబర్ తో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ అక్టోబర్ తో ఆయనకు 63 ఏళ్లు వస్తాయి. అయితే ఆయన పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆయన మరో రెండేళ్లు సేవలను అందిస్తారు. ప్రభుత్వ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ వయసును కూడా 65 ఏళ్లకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులలో మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పదవీకాలం ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రభుత్వం కనుక రిటైర్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకుంటే అది 62 సంవత్సరాలు కానుంది. ఇక గతేడాదే డైరెక్టర్ల గరిష్ట కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైతే రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని, భవిష్యత్తులో తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఇక వచ్చే రెండు నెలల్లో అంటే అక్టోబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి ఈ రెండు నెలల లోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆయన రిటైర్మెంట్ వయసు పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!