8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదనేమీ ప్రభుత్వం ముందు పరిశీలనలో లేదని చెప్పారు. 7వ వేతన సంఘంలోని పేరా 1.22ను పరిగణనలోకి తీసుకోకపోవడానికి, ఆమోదించకపోవడానికి ఫైళ్లలో ఎలాంటి కారణాలు నమోదయ్యాయని రాజ్యసభ సభ్యుడు రామ్నాథ్ ఠాకూర్ ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. ఏడవ వేతన సంఘం ఆధారంగా వేతనాలు, అలవెన్సుల సవరణకు ఆమోదం తెలిపే సమయంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
Read Also:Health Tips : పరగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Also Read
- Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
- Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
- Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
- Nara Lokesh: 'రప్పారప్పా' అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
ఏడవ వేతన సంఘం నివేదికలోని పేరా 1.22లో 5 సంవత్సరాల తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సమీక్షించాలని సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపునకు మార్గం సుగమం చేస్తుంది. కానీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పించుకుంటోంది. పే కమీషన్ భారాన్ని ప్రభుత్వం భరించే స్థితిలో లేనందున ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయడం లేదా అని ఆర్థిక మంత్రిని కూడా అడిగారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గత 30 ఏళ్లుగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ఉద్యోగుల జీతాలను సమీక్షించేందుకు ఎనిమిదో వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ, ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు.
Read Also:Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉద్యోగులు నిరంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచడానికి ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. పే కమిషన్ తన నివేదిక మరియు సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలు చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
-
Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!