Windfall Gain Tax : విండ్ ఫాల్ ట్యాక్స్ ని పెంచిన ప్రభుత్వం.. ఇది కేవలం ముడి చమురు, డీజిల్ పై మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windfall Gain Tax : ముడిచమురు ధరల పెరుగుదల తర్వాత దేశీయంగా ముడిచమురుపై విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఫిబ్రవరి 16, 2024 నుండి అమలులోకి వస్తుంది. క్రూడాయిల్పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ప్రస్తుతం టన్నుకు రూ.3200 నుంచి రూ.3300కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్పై ఎగుమతి పన్నును పెంచారు. అయితే పెట్రోల్, ఏటీఎఫ్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంలో ఎటువంటి మార్పు లేదు.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఫిబ్రవరి 16 శుక్రవారం నుండి ONGC వంటి ప్రభుత్వ చమురు కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై టన్నుకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో రూ. 3300 విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే నెలలో దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.1700 నుండి రూ.3200కి ప్రభుత్వం పెంచింది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Read Also:Ratha Saptami 2024: తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
ముడి చమురు ధరలు బ్యారెల్కు 75డాలర్లు దాటిన తర్వాత, ప్రభుత్వం దేశంలోని ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ను విధిస్తుంది. తద్వారా ప్రభుత్వం ఎగుమతుల ద్వారా వచ్చే అధిక ఆదాయాలపై మరింత పన్ను వసూలు చేస్తుంది. డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు సున్నా నుంచి రూ.1.50కి పెంచారు. ఎగుమతి చేసే డీజిల్పై ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేస్తుంది. పెట్రోల్, విమాన ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం ప్రస్తుతానికి సున్నాగానే ఉంటుంది.
జూలై 1, 2022 నుంచి పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ATFపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది. ముడిచమురు ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వం విత్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ను పెంచుతుంది.
Read Also:Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!