Cease Fire Violation : అమృత్సర్లో కొనసాగుతున్న హైఅలర్ట్.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!
- పంజాబ్ అమృత్సర్లో హైఅలర్ట్
- మరోసారి ప్రజలకు కీలక సూచనలు
- చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన
- ఉదయం 4.39 గంటలకు మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అమృత్సర్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.
READ MORE: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శనివారం తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భద్రతా బలగాలు శత్రు డ్రోన్ను గుర్తించాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. కాల్పుల విరమణ అనంతరం కూడా అమృత్సర్లో రాత్రి డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అమృత్సర్ పరిసరాల్లో వరుసగా మిస్సైల్ శకలాలు లభ్యం అవుతుండటంతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.
READ MORE: Cease Fire Violation : భారత్లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
కాగా.. భారత్, పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా, మరికొన్ని దేశాల దౌత్యంతో.. రెండుదేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (డీజీఎంవో) స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్థాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ.. సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.
Punjab | "By way of abundant caution, please remain indoors with lights off and move away from windows. Please do not move out on the road, balcony or terrace. Don't panic. We will let you know when we can resume normal activities," DC Amritsar, in a guideline issued at 4.39 am
— ANI (@ANI) May 10, 2025
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!