మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ”భీమా”. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు..భీమా సినిమాతోనే ఎ హర్ష టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.భీమా చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్గా నటించారు.ఈ సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సలార్, కేజీఎఫ్ చిత్రాలతో గుర్తింపు పొందిన రవి బస్రూర్ సంగీతం అందించారు.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీమా సినిమా మార్చి 8వ తేదీన థియేటర్స్లో రిలీజ్ అయింది.
ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.పక్కా మాస్ సినిమాగా తెరకెక్కిన భీమా సినిమా థియేటర్ ప్రేక్షకుల్నిఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ మంచి ధరకు సొంతం చేసుకుంది. భీమా మూవీ ఈ నెల 25వ తేదీ (ఏప్రిల్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుందని డిస్నీ ఫ్లస్ హాట్స్టార్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎక్స్ వేదికగా వెల్లడించిందిభీమా సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి .