Google : మీ డేటా ఎవరి చేతుల్లోనైనా పడిందా.. ఫ్రీగా చెక్ చేస్కోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google : ప్రస్తుత హైటెక్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్లో ఏది ఓపెన్ చేయాలన్నా పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది. దీంతో ఆయా సైట్ల నుంచి జనాల పర్సనల్ డేటానంతా సైబర్ నేరగాళ్లు ఈజీగా కొట్టేస్తూ లేదా కొంటూ రకరకాలుగా దోపిడీలకు పాల్పడుతున్నారు. అయితే, గూగుల్ యూజర్లు అందరూ ఇకపై వారి పర్సనల్ డేటా ఇంటర్నెట్ లో ఎవరి వద్దయినా ఉందా? అన్న విషయం చాల తేలికగా తెలుసుకోవచ్చు. ఎవరి వద్దయినా మన పర్సనల్ డేటా ఉన్నట్లు తెలిస్తే.. ఆ డేటాను సులభంగా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం గూగుల్ కంపెనీ ఇదివరకే ‘డార్క్ వెబ్ రిపోర్ట్స్’ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు గూగుల్ వన్ మెంబర్షిప్ (ఎక్స్ ట్రా స్టోరేజ్ కొనుగోలు చేసిన యూజర్లు) ఉన్న వారికి మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి ఉంచింది. కానీ ఈ నెల చివరి నుంచి గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ను ఉచితంగా అందజేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గూగుల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఒక పెద్ద ప్రకటన చేసి దాని వినియోగదారులకు బహుమతిని ఇచ్చింది. యూజర్లందరికీ ఉచితంగా డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ను అందిస్తామని గూగుల్ ప్రకటించింది. ఇప్పటి వరకు Google One సబ్స్క్రిప్షన్ తీసుకునే వారు మాత్రమే డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ని పొందేవారు. కానీ, ఇప్పుడు ఇది వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే డార్క్ వెబ్ రిపోర్ట్ కోసం మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ డార్క్ వెబ్లో మీ ఇమెయిల్ లేదా ఇతర సమాచారాన్ని సెర్చ్ చేస్తుంది. డార్క్ వెబ్లో మీ సమాచారం ఏదైనా కనుగొనబడితే దాని గురించి మీకు తెలియజేస్తుంది. దీనితో మీరు మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవచ్చు.
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
Read Also:Anant Ambani Wedding: స్నేహితులకు 2 కోట్ల వాచ్.. అంబానీతో అట్లుంటది మరి!
‘డార్క్ వెబ్ రిపోర్ట్’ ఇలా పొందాలి..
స్టెప్ 1: గూగుల్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. మెనూను ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్ అవతార్ పై క్లిక్ చేయాలి. మెనూ నుంచి ‘రిజల్ట్స్ అబౌట్ యూ’ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 2: ‘గెట్ స్టార్టెడ్’ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీ పూర్తి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి.
స్టెప్ 4: గూగుల్ యాప్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అలర్ట్ లను రిసీవ్ చేసుకునేందుకు నోటిఫికేషన్ సెట్టింగ్స్ను ఆన్ చేయాలి. ఆ వెంటనే.. ‘మీ పేరు, కాంటాక్ట్ వివరాల సమాచారం కోసం సెర్చ్ చేస్తున్నాం’ అని స్క్రీన్పై ఒక పాపప్ వస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు కొన్ని గంటల టైం పట్టవచ్చు. సెర్చింగ్ పూర్తి కాగానే నోటిఫికేషన్ వస్తుంది.
స్టెప్ 5: సెర్చ్ పూర్తయినట్టు నోటిఫికేషన్ రాగానే ‘రిజల్ట్స్ టు రివ్యూ’ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. మన పర్సనల్ డేటా ఎవరితో ఉందో
చెక్ చేసుకోవాలి. వారి వద్ద ఉన్న డేటాను తొలగించాలనుకుంటే రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఇంతకుముందు ఈ ఫీచర్ Google One సబ్స్క్రిప్షన్తో వచ్చేది, కానీ ఇప్పుడు జూలై 2024 నుండి ఇది Google ఖాతా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే, Google Workspace లేదా సూపర్వైజ్డ్ ఖాతాను ఉపయోగిస్తున్న వారు ఈ ఫీచర్ని పొందలేరు. Google తన Google One సేవ ద్వారా దాని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN)ని మూసివేసిన కొన్ని వారాల తర్వాత ఇది వస్తుంది.
Read Also:Mehandipur Balaji: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వణుకు పుట్టాల్సిందే.. మీకు ధైర్యం ఉందా..?
డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ని ఎక్కడ పొందాలి
ఈ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ను ఎక్కడ పొందాలనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు మీరు ఏ యాప్ను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ఎక్కడా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. Google ప్రకారం.. డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ మీ గురించి ఫలితాలు పేజీకి యాడ్ చేస్తుంది. ఇది Google మరొక సర్వీస్, ఇక్కడ వినియోగదారులు తమ సమాచారం ఏదైనా సెర్చింగ్ ఫలితాల్లో కనిపిస్తుందో లేదో చూసుకునే సదుపాయాన్ని పొందుతారు. వినియోగదారులు తమ డేటాను ఇంటర్నెట్ నుండి తీసివేయవచ్చు. ప్రస్తుతానికి, డార్క్ వెబ్ రిపోర్ట్ 46 దేశాల్లో అమలులో ఉంది, ఇందులో భారతదేశం కూడా ఉంది. గూగుల్ కొన్ని వారాల క్రితం వినియోగదారులందరికీ ఈ ఫీచర్ను అందించాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు కంపెనీ మొబైల్, కంప్యూటర్లో నిరంతరం స్క్రోలింగ్ చేయడం ద్వారా సెర్చ్ చేసే సదుపాయాన్ని నిలిపివేసింది. ఇప్పుడు Google ఒక పేజీ నుండి మరొక పేజీకి వెళ్లే శోధనలను చూపుతుంది.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!