Uttarpradesh : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు… లక్నో-ఢిల్లీ రైల్వే మార్గం మూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని గోండాలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజగా అమ్రోహా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 12 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే దీని కారణంగా ఢిల్లీ-లక్నో రైలు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. అమ్రోహా రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పరిస్థితిని సాధారణీకరించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. గూడ్స్ రైలు మొరాదాబాద్ నుండి ఘజియాబాద్ వైపు వెళుతుంది. అదే సమయంలో అమ్రోహాలోని కళ్యాణ్పురా గేట్ 27C గుండా వెళుతోంది. ఇంతలో ఒక్కసారిగా గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరింది. ప్రమాద స్థలం వద్ద స్థానికులు కూడా గుమిగూడారు. ప్రమాదం కారణంగా ఢిల్లీ నుంచి లక్నో వరకు భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఈ ట్రాక్పై వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.
Read Also:Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
#WATCH | Uttar Pradesh: Around 7 coaches of a goods train derailed in Amroha yard between Ghaziabad-Moradabad section, disrupting traffic. The alternative route between Moradabad-Saharanpur-Meerut Ghaziabad is open for the movement of trains
More details awaited pic.twitter.com/kCnC4zf1Ky
— ANI (@ANI) July 20, 2024
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ్స్ రైలు కళ్యాణ్పుర రైల్వే గేట్ సమీపంలో వెళుతుండగా, గూడ్స్ రైలులోని పలు కోచ్లు ఒక్కసారిగా బోల్తా పడ్డాయి. గూడ్స్ రైలు బండిలు కిందపడటంతో పెద్ద శబ్ధం రావడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఆరా తీయగా గూడ్స్ రైలు కిందపడి ఉండడం గమనించారు. వెంటనే ఘటనాస్థలికి పలువురు గుమిగూడారు. అయితే వెంటనే రైల్వే అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం తర్వాత ఢిల్లీ-లక్నో రైలు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే కార్యాలయాల్లో కలకలం రేగింది. ఇంత పెద్ద ఘటన జరిగినా రైల్వే శాఖ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం, పరిస్థితిని సాధారణీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లక్నో మార్గంలో నడిచే అన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
Read Also:Andhra Pradesh: శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్న కనకదుర్గ, భ్రమరాంబికాదేవి
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!