Site icon NTV Telugu

మహిళలకు షాక్‌ ; భారీగా పెరిగిన బంగారం ధరలు

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 43,600 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెరిగి రూ. 47,560 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 67,500 పలుకుతుంది.

Exit mobile version