NTV Telugu Site icon

Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?

Gold

Gold

Gold Price: దేశంలో బంగారం ధరలు నిరంతరం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,170కి తగ్గింది. విశేషమేమిటంటే ఢిల్లీలో బంగారం ధర నెల రోజుల్లో దాదాపు 6 శాతం తగ్గింది. మే 24న బంగారం ధరలు గరిష్టంగా రూ.62,720కి చేరాయి. ఇప్పుడు దీని తర్వాత అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? లేదా పెట్టుబడిదారులు బంగారం ధర మరింత తగ్గేంతవరకు కోసం వేచి ఉండాలా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం?

ఆగ్‌మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొఠారి మాట్లాడుతూ.. స్వల్పకాలంలో బంగారం తన సురక్షితమైన ఆకర్షణను కోల్పోయిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య వైఖరి గురించి చాలా కఠినంగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, US ఫెడ్ గత 15 నెలల్లో వడ్డీ రేట్లను 500 bps, BoE 475 bps, ECB 400 bps పెంచింది.

Read Also:Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!

బంగారం ధరలు మరింత తగ్గుతాయా?
బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి 3-4 శాతం తగ్గవచ్చని, స్వల్పకాలంలో మరింత బలహీనంగా ఉండవచ్చని కొఠారీ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు నెలల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయని, ప్రస్తుత స్థాయిల కంటే 3-4 శాతం మేర తగ్గుతాయని కొఠారీ చెబుతున్నారు. విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో బంగారం ధర తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే ప్రపంచ ఆర్థిక గణాంకాలు, కేంద్ర బ్యాంకుల చర్యలను పరిశీలిస్తే కేవలం ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే బంగారం ధర పతనం కనిపిస్తోంది.

బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా?
బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని కొఠారి తెలిపారు. 2023 చివరి నాటికి ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నారు. దీంతో బంగారం ధరల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్ల, పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది. దీని కారణంగా ధరలు పెరుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంవత్సరం చివరి నాటికి, ప్రపంచం మాంద్యంలో చిక్కకుంటుదని చెబుతున్నారు. అప్పుడు బంగారం ధర పది గ్రాములకు 65 వేలకు చేరుకుంటుందట.

Read Also:Electric Shock: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. విద్యుదాఘాతంతో మహిళ మృతి