గోల్డ్ లవర్స్కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంటే.. ఇంకోరోజు తగ్గుతున్నాయి. ఇలా ధరలు దోబూచిలాడుతున్నాయి. ఈరోజు మరోసారి భారీగా పుత్తడి ధరలు పెరిగిపోయాయి. శనివారం తులం గోల్డ్పై రూ.2,890 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు.
తులం గోల్డ్పై రూ.2,890 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,650 పెరగడంతో రూ.1,43,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,170 పెరగడంతో రూ.1,17,450 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధర కూడా భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,85, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
