ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ముంబై నగరం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబై నగరంలో బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్ శాఖకు ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేయగా.. ముంబైను అతి త్వరలోనే బాంబు పెట్టి పేల్చబోతున్నాను’ అని ట్వీట్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : Anthony Albanese : మోడీ ఈజ్ ది బాస్ అంటూ ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రధాని
మరో కేసులో ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి 26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. తను రాజస్తాన్ నుంచి మాట్లాడుతున్నానని 26\11 తరహాలో దాడులు చేస్తామని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ను సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోన్ ఎవరు. ఎక్కడి నుంచి చేశారనేది ఆరా తీస్తున్నారు.
Also Read : UPSC: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల
గతంలో కూడా ఇదే వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆ దిశగా పోలీసుల బృందం దర్యాప్తు చేస్తుంది. కాగా గత ఏడాది కాలంగా ముంబై పోలీస్ శాఖకు బెదిరింపు ఫోన్స్ కాల్స్, మెసెజ్లు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. క్రమంలో ఇప్పటికే విమానాశ్రయం, మంత్రాలయ, బీఎస్ఈ తదితర కీలక కార్యాయాల వద్ద ప్రార్థనా స్థలాల వద్ద భారీగా పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసింది. బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.