Goa: గోవాలోని ప్రముఖ నైట్క్లబ్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa Nightclub Blast: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్క్లబ్లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో ఘటనాస్థలం ఉంది. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
READ MORE: Scrub Typhus Ravaging AP: ఏపీని వణికిస్తున్న స్రబ్ టైఫన్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Also Read
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
- YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
- Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ 'పండు మిరపకాయ పచ్చడి'.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంటగదిలో పనిచేస్తుండగా, సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోయింది. శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. దీంతో నైట్క్లబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమీప నివాసితులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ అంశంపై గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం గురించి రాత్రి 12:04 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందిందని చెప్పారు. “పోలీసులు, అగ్నిమాపక దళం, అంబులెన్స్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. మృతదేహాలను వెలికితీశాం. క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్లోని వంటగది ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 23 మంది చనిపోయినట్లు నిర్ధారించాం. అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం సిలిండర్ పేలుడు అని తెలుస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.” అని వివరించారు.
READ MORE: Smartwatch: నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించొచ్చా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఇంతలో, సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో పర్యాటకులు ఎవరూ గాయపడలేదని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. మంటలు చెలరేగిన సమయంలో క్లబ్లో సిబ్బంది కాకుండా చాలా మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు. కానీ వారందరూ సకాలంలో తప్పించుకున్నట్లు స్థానికులు, ఉద్యోగుల తెలిపారన్నారు.
తాజావార్తలు
-
Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)
-
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
-
Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
-
YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!