బీజేపీ తరుఫున మండి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది. సోమవారం హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. కంగనా రనౌత్, ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ల కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. కంగనా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Iran New president: ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బర్
కాగా.. కంగనా రనౌత్ మొదటిసారి కాజాలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చారు. ఇదిలా ఉంటే.. కొన్ని సంవత్సరాల క్రితం X లో టిబెటన్ మత గురువు దలైలామా జ్ఞాపకాన్ని కంగనా షేర్ చేసింది. దీనిపై కూడా వివాదం చెలరేగింది. తర్వాత కంగనా క్షమాపణలు చెప్పింది. గత నెలలో.. కంగనా మెక్లియోడ్గంజ్కు వెళ్లి దలైలామాను కలుసుకుంది. ఈ క్రమంలో.. మీమ్పై తన వైఖరిని తెలియజేసింది. లాహౌల్ స్పితి జనాభాలో 70 శాతం మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. లాహౌల్ స్పితికి రావడంపై నిరసనల గురించి ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలో.. హెలిప్యాడ్కు 100 మీటర్ల దూరంలో బీజేపీ తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ ఘటన దురదృష్టకరమని, పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర అని పేర్కొన్నారు. మరోవైపు.. కంగనా రనౌత్ కాన్వాయ్పై జరిగిన దాడులకు కాంగ్రెస్దే బాధ్యత అని బీజేపీ పేర్కొంది. ఈ క్రమంలో.. రాళ్లు రువ్వడం, నినాదాలు చేయడంపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
