NTV Telugu Site icon

G.O 317 : జీవో 317 పై కేబినేట్‌ సబ్ కమిటీ భేటీ

Go 317

Go 317

జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్తలకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ దరఖాస్తులకు అవకాశం కల్పించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 12 వేల 11 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను రీ – వెరిఫికేషన్ కు అవకాశం కల్పించడం జరిగింది. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ ను వారి సెల్ ఫోన్ కు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.