Global Rice Summit: హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు.. సన్నాహాలు ముమ్మరం
Global Rice Summit: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్ 7, 8వ తేదీల్లో తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఫిలిఫైన్స్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యాపారులు, అనుబంధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. వివిధ దేశాల నుంచి వరి శాస్త్రవేత్తలు ఈ వరి సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ సదస్సులో వరి రకాల ప్రదర్శనతో పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ ఉత్పత్తుల లభ్యతపై వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.
Read Also: MLC Jeevan Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను కాపాడడం ఎవరి తరం కాదు..
Also Read
భారతదేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సు-2024కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడం, భారతదేశం, తెలంగాణ నుంచి బియ్యం రకాలను ప్రదర్శించడం, విజ్ఞాన వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో జరుగుతుంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!