Girls Eloping: ఈ జిల్లా నుంచి పారిపోతున్న అమ్మాయిలు.. ఒక్క నెలలో 164 కేసులు.. షాక్ అవుతున్న పోలీసులు
- ఈ జిల్లా నుంచి పారిపోతున్న అమ్మాయిలు
- ఒక్క నెలలో 164 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ జిల్లాలోని అమ్మాయిలు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది మంది బాలికలు తమ కుటుంబాలకు తెలియజేయకుండా తమ ప్రియమైన వారి కోసం పారిపోతున్నారు. వీరిలో టీనేజర్లు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. ఏకంగా ఒక్క నెలలోనే 164 కేసులు నమోదయ్యాయి. కారణాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు.
Also Read:H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం, ఎలాగంటే.?
Also Read
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
సెప్టెంబరులో, కుషినగర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు 13 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 164 మంది బాలికలు తమకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోయారని ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసిన తర్వాత, పోలీసులు ఈ బాలికల కోసం వెతకడం ప్రారంభించారు. వీరిలో 133 మంది బాలికలను హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల నుండి అరెస్టు చేశారు. విచారణ అనంతరం పోలీసులు వారిని ఇంటికి పంపించారు.
దాదాపు అందరు అమ్మాయిలు కుటుంబ సభ్యులను కాదనుకుని తమకు ఇష్టమైన యువకులతో వెళ్లిపోయారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతీ యువకుల మధ్య కేవలం 3 నెలలు, కొందరికి ఆరు నెలల పరిచయం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. జూలై, ఆగస్టులలో కూడా, అమ్మాయిలు ఇంటి నుండి పారిపోయిన కేసులు రెండు నుండి మూడు వందల వరకు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఒక రోజులో 20 మందికి పైగా బాలికల స్టేట్మెంట్లు నమోదు చేయబడుతున్నాయి.
Also Read:Shahid Afridi: ఆ అంపైర్ ఐపీఎల్లో కూడా ఆడాలి కదా?.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఫ్రిది!
రెండు నెలల క్రితం, తుర్కపట్టి ప్రాంతంలో, ఒక యువతి తన నిశ్చితార్థం రోజున తెల్లవారుజామున తన ప్రియుడితో పారిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆ అమ్మాయి తన నగలు, నగదు, నిశ్చితార్థం కోసం ఉంచిన ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బాలికలు ఇంటికి తిరిగి రాకూడదని, తమకు ఇష్టమైన యువకుడితో కలిసి ఉండాలనే కోరికను వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం, వారిని వన్ స్టాప్ సెంటర్కు పంపారు.
తాజావార్తలు
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
-
Disha Patani : ప్రాణ స్నేహితులకు కన్నీటి వీడ్కోలు.. ఇన్స్టాలో దిశా ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..