Girls Eloping: ఈ జిల్లా నుంచి పారిపోతున్న అమ్మాయిలు.. ఒక్క నెలలో 164 కేసులు.. షాక్ అవుతున్న పోలీసులు
- ఈ జిల్లా నుంచి పారిపోతున్న అమ్మాయిలు
- ఒక్క నెలలో 164 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ జిల్లాలోని అమ్మాయిలు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది మంది బాలికలు తమ కుటుంబాలకు తెలియజేయకుండా తమ ప్రియమైన వారి కోసం పారిపోతున్నారు. వీరిలో టీనేజర్లు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. ఏకంగా ఒక్క నెలలోనే 164 కేసులు నమోదయ్యాయి. కారణాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు.
Also Read:H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం, ఎలాగంటే.?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
సెప్టెంబరులో, కుషినగర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు 13 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 164 మంది బాలికలు తమకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోయారని ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసిన తర్వాత, పోలీసులు ఈ బాలికల కోసం వెతకడం ప్రారంభించారు. వీరిలో 133 మంది బాలికలను హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల నుండి అరెస్టు చేశారు. విచారణ అనంతరం పోలీసులు వారిని ఇంటికి పంపించారు.
దాదాపు అందరు అమ్మాయిలు కుటుంబ సభ్యులను కాదనుకుని తమకు ఇష్టమైన యువకులతో వెళ్లిపోయారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతీ యువకుల మధ్య కేవలం 3 నెలలు, కొందరికి ఆరు నెలల పరిచయం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. జూలై, ఆగస్టులలో కూడా, అమ్మాయిలు ఇంటి నుండి పారిపోయిన కేసులు రెండు నుండి మూడు వందల వరకు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఒక రోజులో 20 మందికి పైగా బాలికల స్టేట్మెంట్లు నమోదు చేయబడుతున్నాయి.
Also Read:Shahid Afridi: ఆ అంపైర్ ఐపీఎల్లో కూడా ఆడాలి కదా?.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఫ్రిది!
రెండు నెలల క్రితం, తుర్కపట్టి ప్రాంతంలో, ఒక యువతి తన నిశ్చితార్థం రోజున తెల్లవారుజామున తన ప్రియుడితో పారిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆ అమ్మాయి తన నగలు, నగదు, నిశ్చితార్థం కోసం ఉంచిన ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బాలికలు ఇంటికి తిరిగి రాకూడదని, తమకు ఇష్టమైన యువకుడితో కలిసి ఉండాలనే కోరికను వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం, వారిని వన్ స్టాప్ సెంటర్కు పంపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!