Uttar Pradesh: వెంటపడొద్దు అన్నందుకు శానిటైజర్ తాగించి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శానిటైజర్ లో విషపదార్థాలు కలిపి ఓ విద్యార్థినికి తాగించి హత్య చేశాడు. అయితే అంతకుముందు విద్యార్థిని వెంటపడుతుండటంతో.. విద్యార్థిని పడొద్దు అని చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. విద్యార్ధిని మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. విద్యార్ధిని మృతిపై న్యాయం కావాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Bandaru Vijaya laxmi: బండారు విజయలక్ష్మి పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచే!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
మృతదేహాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతి చెందిన విద్యార్థిని మీనాక్షి ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. గత కొంత కాలంగా కాలేజీకి వెళ్లే సమయంలో ఐమత్ రాథోడ్ అనే యువకుడు మీనాక్షి వెంటపడేవాడని విద్యార్థిని సోదరుడు చెప్పాడు. ఈ ఘటన జూలై 27న జరిగింది. కాలేజీ సమీపంలో విద్యార్థిని మీనాక్షిని వెంటపడి వేధింపులకు గురిచేశాడని మృతురాలి సోదరుడు తెలిపాడు. నిందితుడు వేధింపులకు పాల్పడుతున్న సమయంలో మీనాక్షి సోదరుడు కూడా అక్కడే ఉన్నట్లు తెలిపాడు. మరోవైపు తనపై కూడా నిందితుడితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు దాడి చేసినట్లు పేర్కొన్నాడు.
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మీనాక్షి మంగళవారం మృతి చెందిందని విద్యార్థి తండ్రి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు.. నిందితుడిని తమకు అప్పగించాలంటూ.. తామే శిక్షిస్తామని తెలిపారు. ఓ వైపు ప్రభుత్వం ‘బేటీ పఢావో బేటీ బచావో’ అంటూ ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు విద్యార్థినులను చంపేస్తున్నారని బాలిక తండ్రి ఆరోపించారు. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై జులై 28న బరేలీలోని ఇజ్జత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్ భాటి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు ఓ టీమ్ను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!