NTV Telugu Site icon

GHMC : ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్‌కు  శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ

Ghmc

Ghmc

ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ కు  జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ లో క్యాప్చర్ చేసింది ఐటీ విభాగం.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌కు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024 నుండి అమలు చేస్తున్నారు.. పారదర్శక, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదుకు తోడ్పడుతుందని GHMC నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయాల తో సహా నమోదవ్వనుంది. కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలతో రెండు గేట్ల ప్రవేశ ద్వారాల వద్ద క్యాప్చుర్ చేసే కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అమర్చిన కెమెరా లో ఫోటో క్యాప్చర్ చేసి ఎంప్లాయ్ ఐడి నెంబర్ అటెండెన్స్ సమయం నమోదు అయ్యేలా ఏర్పాటు చేశారు.

CM Chandrababu: దీపావళికి ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్.. అన్నీ హామీలను నెరవేరుస్తాం..