Israel Hamas War: శ్మశానవాటికగా మారిన గాజా.. 9000 మంది మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ నుండి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ దాడితో ధ్వంసమవుతున్న గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇక్కడ 60 వేల మందికి పైగా గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గాజా నగరంలో గర్భిణీల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ రోజుకు 160 మందికి పైగా మహిళలు పిల్లలకు జన్మనిస్తున్నారు. పతనమైన ఆరోగ్య వ్యవస్థల మధ్య మహిళలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవిస్తున్నారు.
గాజా స్ట్రిప్లో దాదాపు 60,000 మంది గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసింది. మహిళలకు కూడా తగిన ఆరోగ్య సంరక్షణ లేదని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. గాజా జనాభాలో 49శాతం స్త్రీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలను కనే వయస్సులో ఉన్నారు. షెల్లింగ్, దాడుల కారణంగా మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గాజాలో ప్రతి నెల దాదాపు 5,000 మంది మహిళలు పిల్లలకు జన్మనిస్తున్నారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also:Pakistan: రంజాన్ నేపథ్యంలో పైలెట్లు, విమాన సిబ్బందికి పాకిస్తాన్ కీలక ఆదేశాలు.
అంతకుముందు ఫిబ్రవరి 19న, గాజాలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం గణనీయంగా పెరగడంపై ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ UNICEF ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల తర్వాత జరిగిన మారణకాండ కారణంగా నగరంలో మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులు, పూర్తి ముట్టడి కారణంగా గాజన్లు తీవ్రమైన ఆహారం, నీరు, మందులు, ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారు. అలాగే మహమ్మారి, వైద్య సేవలపై ఒత్తిడి కారణంగా నగరవ్యాప్త ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
పాలస్తీనా మహిళలు, వారి కుటుంబాలపై ఇజ్రాయెల్ దాడులు, మారణహోమం తక్షణమే ఆపాలని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఐక్యరాజ్యసమితిని కోరింది. ముఖ్యంగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనా మహిళల ఆరోగ్యం, మానసిక, సామాజిక అవసరాలకు మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సంస్థలను కోరింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 7, 2023 నుండి నగరంలో 9,000 మంది పాలస్తీనియన్ మహిళలు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.
Read Also:Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!