Gayatri Mantra: గాయత్రీ మంత్రంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. వీడియో వైరల్
Gayatri Mantra: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 19) క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ కు చేరుకున్న సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది. బాల్కన్ దేశాలల్లోని క్రొయేషియాకు పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ కావడంతో ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది. ప్రధాని మోదీ అక్కడ హోటల్కు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయులు వందేమాతరం, భారత మాతకి జై.. అనే నినాదాలతో స్వాగతించారు. అంతేకాకుండా పెద్దేత్తున్న భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఈ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక ఘట్టం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెల్ల దుస్తుల్లో ఉన్న కొందరు క్రొయేషియన్ పౌరులు గాయత్రీ మంత్రం, ఇతర సంస్కృత శ్లోకాలతో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని గౌరవించే ఈ ఘట్టం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని మోదీ తన అధికారిక X అకౌంట్ ద్వారా పంచుకున్నారు. సంస్కృతికి ఉన్న బంధాలు బలంగా, ఉజ్వలమైనవిగా ఉన్నాయి.. జాగ్రెబ్లో ఈ స్వాగత ఘట్టం చూడడం సంతోషకరం. క్రొయేషియాలో భారతీయ సంస్కృతికి ఇంత గౌరవం ఉండటం ఎంతో గర్వకరం అంటూ మోదీ పేర్కొన్నారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ మరో వీడియోను షేర్ చేస్తూ.. జాగ్రెబ్లో స్వాగతం మరపురానిది.. ప్రేమతో, ఆత్మీయతతో నిండిన స్వాగతం, కొన్ని ముఖ్యమైన క్షణాలు మీకోసం…” అని పేర్కొన్నారు. అనంతరం అక్కడి భారతీయ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా ముఖాముఖి భేటీ అయ్యారు. జాగ్రెబ్లో ఉన్న కొంతమంది భారతీయులతో మాట్లాడే అవకాశం లభించింది. అక్కడ లభించిన ఆత్మీయ స్వాగతం మరువలేనిది. ఈ పర్యటన వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని వారికి విశ్వాసం ఉందని మోదీ అన్నారు.
The bonds of culture are strong and vibrant! Here is a part of the welcome in Zagreb. Happy to see Indian culture has so much respect in Croatia… pic.twitter.com/G749A952wP
— Narendra Modi (@narendramodi) June 18, 2025
ఈ పర్యటనలో మరో విశేషం ఏమిటంటే.. క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్ స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కెనడాలో జరిగిన G7 సమ్మిట్లో పాల్గొన్న అనంతరం మోదీ జాగ్రెబ్కి చేరుకున్నారు. ఆయన ఇటలీ, కెనడా తర్వాత సైప్రస్కి కూడా పర్యటన ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా క్రొయేషియా చేరుకున్నారు.
A welcome to remember in Zagreb, full of warmth and affection! Here are the highlights… pic.twitter.com/PVSdiVAekO
— Narendra Modi (@narendramodi) June 18, 2025
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?