NTV Telugu Site icon

Gautham Menon : మనశ్శాంతి లేదు.. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తుంది..

Whatsapp Image 2024 02 29 At 4.34.24 Pm

Whatsapp Image 2024 02 29 At 4.34.24 Pm

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరియు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.అయితే ఈ మూవీకి ప్రారంభం నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి అయితే రావడం లేదు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై దర్శకుడు తాజాగా స్పందించారు. ఈ సినిమా వల్ల మనశ్శాంతి కరువైందని, తనతో సహా ఫ్యామిలీ అంతా ఎంతో బాధను అనుభవిస్తున్నారని, ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదలపై మాట్లాడుతూ.. ”ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుండంతో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేకుండా పోయింది. నా కుటుంబం ఎంతగానో ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయం గురించే ఆలోచిస్తోంది. నాకు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోంది. కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నాను.

మార్చి 1న ‘జాషువా’ సినిమా రిలీజ్ కానుంది. దీని కంటే ముందే ‘ధృవ నక్షత్రం’ విడుదల చేయాలని భావించాము కానీ, అది కుదరలేదు” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.’ధృవ నక్షత్రం’ సినిమా 2015 లోనే సెట్స్ మీదకు వెళ్ళింది. వీలయినంత త్వరగా పూర్తి చేసి 2017లో విడుదల చెయ్యాలని మేకర్స్ భావించారు.కానీ ఆర్థిక ఇబ్బందులతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిలిచిపోయింది. గతంలో గౌతమ్ మీనన్ – శింబు కాంబినేషన్లో ఓ సినిమా కమిటై, పూర్తి చేయకపోవడంతో ఆల్ ఇన్ పిక్చర్స్ నిర్మాత కోర్టును ఆశ్రయించారు.రూ.2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకొని కూడా సినిమాని పూర్తి చేయలేదని, డబ్బు తిరిగి ఇవ్వలేదని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.. నగదు తిరిగి చెల్లించేవరకూ ‘ధృవ నక్షత్రం’ విడుదలను ఆపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండంతో విడుదల వరుసగా వాయిదా పడుతుంది..