Gautam Gambhir : కోహ్లి, రోహిత్ లకు గంభీర్ చెక్ పెట్టనున్నాడా..?
- టీ20 ప్రపంచకప్ తో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగియనుంది.
- కొత్త కోచ్గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైనట్లు వార్తలు .
- బీసీసీఐ మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన చేయొచ్చునని సమాచారం.
- బీసీసీఐ ఎదుట గౌతమ్ గంభీర్ కొన్ని డిమాండ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ తర్వాత ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం అయిపోనుంది. దీంతో టీమిండియా కొత్త కోచ్ గా ఎవరు వస్తారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా నుంచి జరుగుతున్న పరిణామాల కొద్ది.. టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఈ పోస్టుకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన విషయాలు వరల్డ్ కప్ తర్వాత అధికార ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. అయితే గౌతమ్ గంభీర్ ఈ కోచ్ పదవిని తీసుకోవడానికి ముందు బీసీసీఐకు కొన్ని కండిషన్స్ ముందు ఉంచాలని దానికి కూడా బిసిసిఐ పచ్చ జెండా ఊపినట్లు వివిధ ఛానల్ ద్వారా సమాచారం అందుతోంది. ఇక గౌతమ్ గంభీర్ ఎలాంటి చర్యలను బిసిసిఐ ముందు ఉంచాడో ఒకసారి చూస్తే..
Meenakshi Chaudhary: స్టార్ కమెడియన్ హీరోతో జతకట్టబోతున్న మీనాక్షి చౌదరి..!
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 ఫార్మట్ లలో కోచ్ లతోపాటు సహాయ సిబ్బందిని కూడా ఆయనకు నచ్చిన విధంగా ఉండాలని కోరినట్లు సమాచారం. అలాగే ఒక్కసారి తాను కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టుకు సంబంధించిన ఈ విషయంలో కూడా బీసీసీఐ లేదా బయట నుంచి ఎవరు జోక్యం చేసుకోకూడదని కండిషన్ పెట్టాడట. అలాగే 2025లో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (kohli), రోహిత్ శర్మ (rohith sharma), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ వంటి టాప్ ప్లేయర్లను ఈ టోర్నీలో విజయం సాధించకపోతే గనక వారిని తప్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకూడదని గంభీర్ కోరాడట. దీంతో వీరిని మూడు ఫార్మాట్లు నుంచి తప్పిస్తారా.. లేదంటే., కేవలం వన్డేలవరకే ఈ పరిణామం ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
PM Modi: దేశానికి మంచి బాధ్యతాయుతమైన విపక్షం అవసరం(వీడియో)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ను దృష్టిలో ఉంచుకొని భారత బెస్ట్ టీంను సిద్ధం చేయాలని సీనియర్ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ.. క్రమంగా యువ ఆటగాళ్లకు కూడా జట్టులో భాగం కలిగించేలా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. ఇక చివరగా 2027 లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ ను సాధించడమే తన అసలైన లక్ష్యం అని గౌతమ్ గారు చెప్పాడు. అందుకుగాను ఇప్పుడు నుంచే తగిన ప్రణాళికలు ఉంటాయని ఆయన తెలిపాడు.. కాబట్టి తనకు పూర్తి స్వేచ్ఛ చేయాలని బిసిసిఐను కోరినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!