Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళాలో పాల్గొననున్న గౌతమ్ అదానీ
- నేడు మహా కుంభమేళాలో పాల్గొనున్న గౌతమ్ అదానీ.
- ప్రతిరోజూ లక్ష మందికి ఉచిత మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న అదానీ గ్రూప్.
- వివిధ సేవ కార్యక్రమాలలో పాల్గొననున్న గౌతమ్ అదానీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) పుణ్యస్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఇస్కాన్ శిబిరానికి చేరుకుని భక్తులకు సేవలందించనున్నారు. అదానీ బంద్వాలో హనుమాన్ (Hanuman) ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇస్కాన్ (ISKCON) సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. గౌతమ్ అదానీ మహాకుంభ మేళ ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదానీ గ్రూప్ ప్రతిరోజూ లక్ష మందికి ఉచిత మహాప్రసాదాన్ని (free meals) పంపిణీ చేస్తోంది. ఈ భోజనంలో రోటీలు, పప్పు, అన్నం, కూరగాయలు, మిఠాయిలు తదితర భోజనాలను భక్తులకు అందిస్తున్నారు. డిఎస్ఎ గ్రౌండ్ సమీపంలో భారీ వంటగదిని ఏర్పాటు చేసి, ప్రతిరోజూ లక్ష మందికి పైగా భోజనం తయారు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల కోసం అదానీ గ్రూప్ గోల్ఫ్ కార్ట్స్ ల సౌకర్యాన్ని కల్పించింది. ఈ బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా వారు సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భక్తుల ప్రయాణం సులభతరం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Also Read: BSNL Recharge: జియో, ఎయిర్టెల్కు ఇక దబిడి దిబిడే.. రోజుకు రూ.5 ఖర్చుతో బిఎస్ఎన్ఎల్ ఏడాది రీఛార్జ్
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అదానీ ఇస్కాన్ క్యాంప్లో భండారా ప్రసాద్ లో కొద్దీ సేపు సేవలందించనున్నారు. ఇస్కాన్, గీతా ప్రెస్ల సహకారంతో అదానీ గ్రూప్ భక్తుల కోసం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా కోటి ఆరతులను పంపిణీ చేస్తూ మహాకుంభ స్ఫూర్తిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. గౌతమ్ అదానీ ఇటీవల ఇస్కాన్ గురు ప్రసాద్ స్వామిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “సేవే నిజమైన దేశభక్తి రూపం. సేవే ధ్యానం, సేవే ప్రార్థన, సేవే భగవంతుడు” అంటూ తన భావనను వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్ జంక్షన్ సమీపంలో మహాప్రసాదం అందించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు సమర్ధవంతమైన సేవలు అందించడానికి 1,800 మంది సిబ్బందిని నియమించారు. భక్తులు సేవలను సులభంగా పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!