Gannavaram TDP: వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ
కృష్ణాజిల్లాలో రాజకీయం వేడెక్కుతూనే ఉంటుంది. మొన్న గుడివాడలో.. ఇప్పుడు గన్నవరంలో. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గన్నవరం రెబల్ ఎం.ఎల్ ఏ వంశీ పై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. టి.డి.పి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న గన్నవరం నియోజక వర్గంలో టి.డి.పి పార్టీ తరుపున గెలిచి ఏరు దాటేక తెప్ప తగలపెట్టినట్లుగా మాట్లాడరు స్థానిక ఎమ్మెల్యే..నీకు రాజకీయ భిక్ష పెట్టినందుకు సైకో అని అన్నావా? టీడీపీ హయాంలో గన్నవరం కి అధిక నిధులు మంజూరు చేసినందుకు సైకో అని అన్నావా? అన్నారు దొంతు చిన్నా.
నువ్వు ఒక సైకో.. పైశాచిక ఆనందం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాడు మీ జగన్ మోహన్ రెడ్డి….తల్లి తల్లి అంటూ భువనశ్వరి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడింది నువ్వు కాదా వంశీ….మనం ఎక్కడ నుండి వచ్చాము మనం రాజకీయ అడుగు ఎలా వేశాం అని నీకు గుర్తు లేదా? పరిటాల రవి పేరు చెప్పుకొని నువ్వు ఎంత సంపందిచవ్ ఎన్ని దందాలు చేసేవో అది తెలియదా? తెలుగుదేశం పార్టీ లేక పోతే నువ్వు ఎక్కడ ఉన్నావో అది తెలుసుకో….ఒకరిని సైకో అనే అప్పుడు నువ్వు ఏంటి అనేది తెలుసుకో అని దుయ్యబట్టారు.
Also Read
Read Also: Gujarat Marriage: గుజరాత్లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
రైతుకి గిట్టుబాటు ధర లేక అల్లాడి పోతున్నారు.. టీడీపీ తరపున గన్నవరం లో మా జాతీయ నాయకుడు చంద్రబాబు చెప్పిన విధంగా ఎవరు నిలబెట్టిన గెలిచి చూపిస్తాం….నాకు నేను మగాడు అనుకుంటే సరిపోదు.. ప్రజలే బుద్ధి చెబుతారు వచ్చే ఎన్నికల్లో.. చంద్రబాబు భిక్ష తో టి.డి.పి పార్టీ తరుపున గేలిచావ్ అది గుర్తు పెట్టుకోవాలి వంశీ నువ్వు. మధం ఎక్కి మాట్లాడుతున్నావ్ వంశీ….నీ మీద చంద్రబాబు,లోకేష్ కావాలా గెలవటానికి గన్నవరం టి.డి.పి పార్టీ గెలుపునకు అడ్డా. సామాన్య కార్యకర్త నీ గన్నవరం లో టి.డి.పి పార్టీ తరుపున నిలబెట్టిన గెలిపిచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు దొంతు చిన్నా.
మీ ముఖ్యమంత్రి లాగా నువ్వు మాట్లాడుతున్నవ్ మిస్టర్ వంశీ….వైసిపి పార్టీ నాయకుడు యార్లగడ్డ వెంక్ట్రవ్ తన సొంత కార్యక్రమానికి వై.సి.పి నాయకులు వెళితే నువ్వు వాలని పిలిచి వాళ్లకి వార్మింగ్ ఇవ్వలేదా?దమ్ముంటే పట్టాభి ఇంటికి వెళ్ళి చూడు ఏమి జరిగిద్దో వంశీ నీకు….గన్నవరం లో నీ మీద గెలవటానికి చంద్రబాబు,లోకేష్ అవసరం లా నిన్ను గెలవాలి అంటే నేను చాలు వంశీ…రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా….. మీకు వైసిపి లో విలువ ఉందా వంశీ….సైకో అంటే జగన్ జగన్ అంటే సైకో అది తెలుసుకో.. లోకేష్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గన్నవరం కి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేసెరో చూసుకో అని సవాల్ విసిరారు. ఒళ్లు జాగర్త పెట్టుకొని మాట్లాడు వంశీ…మహిళ నాయకులు. రాజీనామా చేసి గెలిచి గన్నవరం లో నీ సత్తా చూపించాలన్నారు. నీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ నీ వాళ్ళు అవ్వరు వంశీ అది గుర్తు పెట్టుకోవాలన్నారు టీడీపీ నేతలు.
Read Also: Gujarat Marriage: గుజరాత్లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
తాజావార్తలు
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!