ఇండియన్ సినిమాలో మాటలు లేని సినిమాలు రావడం చాలా అరుదు. ఒకప్పుడు కమల్ హాసన్ ‘పుష్పక విమానం’తో సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు అదే జానర్లో వచ్చిన ప్రయోగాత్మక చిత్రమే ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వైవిధ్య నటుడు అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైలెంట్ డ్రామను.. దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. అయితే ఈ చిత్రం తాజాగా ఓటిటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది.
Also Read : Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాపై.. అనిల్ రావిపూడి క్లారిటీ!
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకోగా, ప్రస్తుతం ఈ సినిమాను చూడాలంటే కేవలం సబ్స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. ఇది ‘రెంటల్’ (Rental) పద్ధతిలో అందుబాటులో ఉంది. అంటే, ప్రైమ్ సబ్స్క్రైబర్లు కూడా అదనంగా కొంత మొత్తం చెల్లించి మాత్రమే ఈ సినిమాను చూడగలరు. ఇక తమిళనాడులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, తెలుగులో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. కానీ ఓటిటీలో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు మంచి స్పందన లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కొన్ని వారాల తర్వాత ఇది రెంటల్ ఫ్రీగా, అంటే సాధారణ సబ్స్క్రిప్షన్తోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అంతవరకు ఆగలేని వారు రెంట్ చెల్లించి విజయ్ సేతుపతి, అరవింద స్వామిల అద్భుత నటనను వీక్షించవచ్చు.