Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
Read Also: Operation Sindoor: మేడిన్ చైనా ఏదైనా అంతేనా..? పాక్ను నిండా ముంచిన డ్రాగన్..!
మే 6, 2025న శిక్ష ఖరారైన నేపథ్యంలో భారత రాజ్యాంగం 191(1)(e), ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఆయన అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. కర్ణాటక అసెంబ్లీ విడుదల చేసిన ప్రకటనలో, ఆయన గంగావతి నియోజకవర్గానికి ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగలేడని పేర్కొన్నారు. అలాగే, న్యాయస్థానం తీర్పు మేరకు జనార్ధన్ రెడ్డి శిక్ష అనంతరం ఇంకా ఆరు సంవత్సరాలపాటు ప్రజా పదవులు పొందడానికి అనర్హుడిగా ఉంటారు. అయితే, న్యాయస్థానం ఆయనకు శిక్షపై స్టే ఇస్తే మాత్రం ఈ అనర్హత తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశముంది.
Read Also: Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ ఖనిజ తవ్వకాల కేసులో జనార్ధన్ రెడ్డికి తోడు మరికొందరికి కూడా శిక్షలు విధించబడ్డాయి. ఇక ఆయన సంస్థపై కూడా రూ.1 లక్ష జరిమానా విధించారు. కేసులో గాలి జనార్ధన్ రెడ్డి రెండవ నిందితుడిగా ఉన్నారు. నిజానికి జనార్ధన్ రెడ్డి, బళ్లారిలో బీజేపీకి బలమైన నేతగా ఒకప్పుడు గుర్తింపు పొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వీడ్కోలు చెప్పి “కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (KRPP)” ఏర్పాటు చేసి గంగావతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024లో మాత్రం KRPPను బీజేపీలో విలీనం చేసి పార్టీలో తిరిగి చేరారు. ప్రస్తుత పరిణామాలతో గంగావతి నియోజకవర్గం స్థానము ఖాళీ అయ్యింది. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.