Gali Janardhana Reddy: ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన గాలి జనార్ధన్ రెడ్డి.. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా?
- ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష
- కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
Read Also: Operation Sindoor: మేడిన్ చైనా ఏదైనా అంతేనా..? పాక్ను నిండా ముంచిన డ్రాగన్..!
Also Read
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
మే 6, 2025న శిక్ష ఖరారైన నేపథ్యంలో భారత రాజ్యాంగం 191(1)(e), ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఆయన అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. కర్ణాటక అసెంబ్లీ విడుదల చేసిన ప్రకటనలో, ఆయన గంగావతి నియోజకవర్గానికి ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగలేడని పేర్కొన్నారు. అలాగే, న్యాయస్థానం తీర్పు మేరకు జనార్ధన్ రెడ్డి శిక్ష అనంతరం ఇంకా ఆరు సంవత్సరాలపాటు ప్రజా పదవులు పొందడానికి అనర్హుడిగా ఉంటారు. అయితే, న్యాయస్థానం ఆయనకు శిక్షపై స్టే ఇస్తే మాత్రం ఈ అనర్హత తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశముంది.
Read Also: Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ ఖనిజ తవ్వకాల కేసులో జనార్ధన్ రెడ్డికి తోడు మరికొందరికి కూడా శిక్షలు విధించబడ్డాయి. ఇక ఆయన సంస్థపై కూడా రూ.1 లక్ష జరిమానా విధించారు. కేసులో గాలి జనార్ధన్ రెడ్డి రెండవ నిందితుడిగా ఉన్నారు. నిజానికి జనార్ధన్ రెడ్డి, బళ్లారిలో బీజేపీకి బలమైన నేతగా ఒకప్పుడు గుర్తింపు పొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వీడ్కోలు చెప్పి “కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (KRPP)” ఏర్పాటు చేసి గంగావతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024లో మాత్రం KRPPను బీజేపీలో విలీనం చేసి పార్టీలో తిరిగి చేరారు. ప్రస్తుత పరిణామాలతో గంగావతి నియోజకవర్గం స్థానము ఖాళీ అయ్యింది. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?