Gali Janardhana Reddy: ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన గాలి జనార్ధన్ రెడ్డి.. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా?
- ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష
- కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్.
Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
Read Also: Operation Sindoor: మేడిన్ చైనా ఏదైనా అంతేనా..? పాక్ను నిండా ముంచిన డ్రాగన్..!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
మే 6, 2025న శిక్ష ఖరారైన నేపథ్యంలో భారత రాజ్యాంగం 191(1)(e), ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఆయన అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. కర్ణాటక అసెంబ్లీ విడుదల చేసిన ప్రకటనలో, ఆయన గంగావతి నియోజకవర్గానికి ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగలేడని పేర్కొన్నారు. అలాగే, న్యాయస్థానం తీర్పు మేరకు జనార్ధన్ రెడ్డి శిక్ష అనంతరం ఇంకా ఆరు సంవత్సరాలపాటు ప్రజా పదవులు పొందడానికి అనర్హుడిగా ఉంటారు. అయితే, న్యాయస్థానం ఆయనకు శిక్షపై స్టే ఇస్తే మాత్రం ఈ అనర్హత తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశముంది.
Read Also: Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ ఖనిజ తవ్వకాల కేసులో జనార్ధన్ రెడ్డికి తోడు మరికొందరికి కూడా శిక్షలు విధించబడ్డాయి. ఇక ఆయన సంస్థపై కూడా రూ.1 లక్ష జరిమానా విధించారు. కేసులో గాలి జనార్ధన్ రెడ్డి రెండవ నిందితుడిగా ఉన్నారు. నిజానికి జనార్ధన్ రెడ్డి, బళ్లారిలో బీజేపీకి బలమైన నేతగా ఒకప్పుడు గుర్తింపు పొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వీడ్కోలు చెప్పి “కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (KRPP)” ఏర్పాటు చేసి గంగావతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024లో మాత్రం KRPPను బీజేపీలో విలీనం చేసి పార్టీలో తిరిగి చేరారు. ప్రస్తుత పరిణామాలతో గంగావతి నియోజకవర్గం స్థానము ఖాళీ అయ్యింది. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?