Gali Janardhana Reddy: ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన గాలి జనార్ధన్ రెడ్డి.. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా?
- ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష
- కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
Read Also: Operation Sindoor: మేడిన్ చైనా ఏదైనా అంతేనా..? పాక్ను నిండా ముంచిన డ్రాగన్..!
Also Read
- India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
మే 6, 2025న శిక్ష ఖరారైన నేపథ్యంలో భారత రాజ్యాంగం 191(1)(e), ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఆయన అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. కర్ణాటక అసెంబ్లీ విడుదల చేసిన ప్రకటనలో, ఆయన గంగావతి నియోజకవర్గానికి ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగలేడని పేర్కొన్నారు. అలాగే, న్యాయస్థానం తీర్పు మేరకు జనార్ధన్ రెడ్డి శిక్ష అనంతరం ఇంకా ఆరు సంవత్సరాలపాటు ప్రజా పదవులు పొందడానికి అనర్హుడిగా ఉంటారు. అయితే, న్యాయస్థానం ఆయనకు శిక్షపై స్టే ఇస్తే మాత్రం ఈ అనర్హత తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశముంది.
Read Also: Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ ఖనిజ తవ్వకాల కేసులో జనార్ధన్ రెడ్డికి తోడు మరికొందరికి కూడా శిక్షలు విధించబడ్డాయి. ఇక ఆయన సంస్థపై కూడా రూ.1 లక్ష జరిమానా విధించారు. కేసులో గాలి జనార్ధన్ రెడ్డి రెండవ నిందితుడిగా ఉన్నారు. నిజానికి జనార్ధన్ రెడ్డి, బళ్లారిలో బీజేపీకి బలమైన నేతగా ఒకప్పుడు గుర్తింపు పొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వీడ్కోలు చెప్పి “కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (KRPP)” ఏర్పాటు చేసి గంగావతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024లో మాత్రం KRPPను బీజేపీలో విలీనం చేసి పార్టీలో తిరిగి చేరారు. ప్రస్తుత పరిణామాలతో గంగావతి నియోజకవర్గం స్థానము ఖాళీ అయ్యింది. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!