ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును తిరువణ్ణామలైలో స్పెషల్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే.. వివరాల ప్రకారం.. రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్ రాజా(26) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన జాన్సీరాణి(20)ని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. అయితే.. తమిళనాడులో కార్తీక్ రాజా 21 పెళ్ళిళ్ళు వ్యవహారం సంచలనం రేపుతోంది. పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఇంట్లో మర్యాదలు కాస్తా తగ్గినట్లు అనిపిస్తే కొత్త పెళ్ళి రెడీ అవుతున్నాడు కార్తీక్ రాజా. పెళ్ళి చేసుకున్నమా… డబ్బు, నగలతో పారిపోయామా అన్నట్లుగా ఉంది కార్తీక్ రాజా తీరు. అయితే.. 21 మంది యువతులను రకరకాల పేర్లు …. రకరకాల ఉద్యోగాలు అంటూ పెళ్ళి చేసుకున్న కార్తీక్ రాజా…. రామనాధపురం జిల్లా పరమకుడికి చెందినట్లుగా తెలుస్తోంది.
Also Read : Fuel Tanker Explosion: పేలిన ఇంధన ట్యాంకర్.. 10 మంది మృతి, 40 మందికి గాయాలు
అయితే.. మార్చిలో జాన్సీరాణి అనే యువతిని పెళ్ళి చేసుకుని అమె వద్దున్న ఐదు సవరాల నగలు, నగదుతో పరారయ్యాడు కార్తీక్ రాజా. అయితే.. భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది జాన్సీరాణి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రాజాను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే.. పోలీసుల విచారణలో కార్తీక్ రాజా సమాధానాలు పోలీసులకు షాక్ ఇచ్చాయి. అయితే.. గతంలో 20 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. పెళ్ళి చేసుకోవడం వారి కొన్నాళ్ళు ఎంజాయ్ చేయడం పారిపోవడం చేస్తున్నట్లు, దోచుకున్న నగలతో డబ్బున్న వాడిలా కలరింగ్ ఇస్తూ మరో పెళ్ళికి పెట్టుబడిగా పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
