Site icon NTV Telugu

Missing: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

Missing

Missing

కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన జరిగింది. తణుకు పరిధిలోని సజ్జాపురంకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక, సెలవులు సందర్భంగా యానాం విహార యాత్రకు వచ్చిన స్టూడెంట్స్.. విహార యాత్ర ముగించుకొని వెళ్తూ వెళ్తూ.. గోదావరిలోకి యువకులు దిగారు. గోదావరిలో గల్లంతైన నలుగురు తణుకు కి చెందిన విద్యార్థులు 1. రవితేజ,(20) డిగ్రీ, బాలాజీ(21) బీటెక్, కార్తీక్(21) బీటెక్, గణేష్(22) గా గుర్తించారు.

Exit mobile version