Cyber Fraud: నాలుగు విధాలుగా ప్రజలను ట్రాప్ చేస్తున్న కేటుగాళ్లు.. మీ డబ్బు జర జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సైబర్ కేటుగాళ్లు ప్రజలను తమ ఉచ్చులో పడేయడానికి అనేక కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. రోజుకో కొత్త వ్యూహాలు, ట్రిక్కులతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. జాబ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు అంటూ జనాలకు సైబర్ నేరస్థులు వల వేస్తున్నారు. ఆపై ఆన్లైన్ చెల్లింపులు చేయమని అడుగుతారు. మీరు సమాచారం ఇచ్చిన వెంటనే మీ ఖాతా నుండి డబ్బు దొంగిలించేస్తు్న్నారు. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాటికి గురికాకుండా ఉండాలంటే కొన్ని మార్గాలున్నాయి. అసలు మోసాలు ఎలా చేస్తారో.. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.
UPI రీఫండ్ స్కామ్
ప్రస్తుతం ఏ చిన్న ట్రాన్సక్షన్ కు అయినా యూపీఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిరాణా దుకాణాల నుంచి మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు జోరందుకున్నాయి. సైబర్ నేరగాళ్లు అలాంటి వారిని టార్గెట్ చేస్తూ యాప్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. సైబర్ నేరగాళ్లు UPI రీఫండ్ ను ఆకర్షిస్తూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సందర్భంలో మీరు రీఫండ్ సమయంలో దాన్ని ధృవీకరించాలి. ఏదైనా చెల్లింపు ధృవీకరణ తర్వాత మాత్రమే చేయాలి.
Also Read
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
Read Also:Jeff Bezos Buys Estate: రూ. 560 కోట్లతో లగ్జరీ ఎస్టేట్ కొన్న బెజోస్.. ఎవరి కోసమో తెలుసా?
OTP స్కామ్
చాలా వరకు మోసాలు OTP ద్వారానే జరుగుతున్నాయి. నకిలీ సందేశం కింద, నేరస్థులు మీ నుండి మోసం OTP లేదా PIN వివరాలను పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ వివరాలతో వారు మీ ఖాతా నుండి డబ్బును తీసివేస్తారు. అలాంటి మోసాలను నివారించడానికి మీరు OTP, PINని సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
నకిలీ డెలివరీ స్కామ్
సైబర్ నేరగాళ్లు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ కి సంబంధించిన నకిలీ వెబ్సైట్ ద్వారా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తారు. OTP మొదలైన వాటి ద్వారా ఈ ఆఫర్పై వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సమాచారం సహాయంతో ఖాతాలోకి చొరబడి మోసాలకు పాల్పడుతారు. మీరు ఇలాంటి మోసాన్ని నివారించాలనుకుంటే రిజిస్టర్డ్ స్థలాల నుండి మాత్రమే లావాదేవీలు చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడం అత్యుత్తమం.
Read Also:UPI in Other Countries: దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థపై ప్రశంసలు… యూపీఐపై ఆసక్తి చూపుతున్న జపాన్
నకిలీ బిల్లుల ద్వారా మోసం
మీరు మీ కరెంటు బిల్లును ఆన్లైన్లో చెల్లించడం ద్వారా కేటుగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. చాలా మంది వినియోగదారులు వాట్సాప్లో రాంగ్ నంబర్ల నుండి సందేశాలు అందుకుంటున్నారని, వారు వెంటనే నిర్దిష్ట నంబర్కు కాల్ చేయకపోతే వారి విద్యుత్ కనెక్షన్ త్వరలో నిలిపివేయబడుతుందని పేర్కొంటున్నారు. ఈ మెసేజ్ వాస్తవికతను తనిఖీ చేయకుండా ఎప్పుడూ సమాచారం ఇవ్వకూడదు. మొదట దాన్ని తనిఖీ చేసిన తర్వాతే రిప్లై ఇవ్వాలి.. లేదంటే మీ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ.
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!