Accident: అదుపు తప్పిన లారీ.. మూడు ట్రక్కులు, రెండు కార్లు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది. ధర్మపురి – సేలం జాతీయ రహదారిలోని తోప్పురు కట్టమేడు క్రాస్ వంతెన రూట్ లో ధర్మపురి నుంచి సేలం వైపు వెళుతున్న ఓ లారీ వంతెనపై అదుపు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Devara : సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఆ కీలక ట్విస్ట్..?
Also Read
కాగా, ముందు వెళ్తున్న రెండు కార్లు, మరో రెండు లారీలను ట్రక్కు ఢీ కొట్టింది. ఓ లారీ అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోగా.. క్షణాల్లో వంతెనపై నుజ్జయిన వాహనాల్లో మంటలు వచ్చాయి. దీంతో ఆ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగురు మరణించినట్టు పోలీసులు నిర్ధారించాగా.. మరో ఎనిమిది మందికి గాయాలు కావడంటి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: Adi srinivas: కేటీఆర్ కు దోరాహంకారం ఇంకా పోలేదు.. ఆది శ్రీనివాస్ ఫైర్
అయితే, వంతెనపై నుంచి పడ్డ లారీ కింది భాగంలో ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. అలాగే, మంటల్లో మరెవరైనా ఆహుతి అయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన కారణంగా ధర్మపురి – సేలం మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్ట్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
நேற்று மாலை தர்மபுரி மாவட்டம் தொப்பூர் கணவாய் பகுதியில் மிகப்பெரிய கோர விபத்து நடைபெற்றது இதில் 4 பேர் உயிரிழந்திருக்கிறார்கள் கனரக வாகன ஓட்டுனர்கள் மிகவும் கவனமாக வாகனங்களை இறக்குங்கள்! #dharmapuri #accident pic.twitter.com/HeGQZR4RDf
— 𝐃𝐫.𝗸𝘂𝗺𝗮𝗿_𝗔𝘆𝘆𝗮𝗿 (@Kumar_ayyar) January 25, 2024
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!