అనంతపురం : ప్రశాంత్ కిషోర్ కాదు… వాళ్ల నాన్న.. తాతకు కూడా భయపడేది లేదని… చంద్రబాబు రాజకీయాల్లో నుంచి ఇక తప్పుకోవాలని.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
20 వేల కోట్ల విలువైన మత్తు మందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరని…. ఏ మంత్రులు నోరువిప్పటంలేదని మండిపడ్డారు. రైళ్లు, విమానాలు, విమానాశ్రయాలు అమ్మేస్తున్నారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పట్టాభి ని పోలీసులు పొట్టపై పిడిగుద్దులు గుద్దారు…కానీ ఆ విషయం ఎవరికి తెలియదన్నారు.
విజయవాడలో ఒక పెద్ద పోలీస్ అధికారి 5 కోట్లు లంచం తీసుకున్నట్లు నా వద్ద సమాచారం ఉందని…. రాష్ట్రంలో రానున్న 2024 ఎన్నికల్లో బలిజ, కాపు సామాజిక వర్గం వారిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల అనంతరం రెండు సామాజకవర్గాలను పక్కన పెట్టేస్తామన్నారు. 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు దీపావళి లోపు ఉపకార వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.