కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.
Breaking: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కన్నుమూత..
- కాంగ్రెస్ సీనియర్ నేత
- మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలిపిన కుటుంబీకులు
![D.srinivas](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/06/D.srinivas-1024x576.jpg)
D.srinivas