Forest Fire : ఉత్తరాఖండ్లో కాలుతున్న అడవులు.. 10 మంది మృతి
- ఉత్తరాఖండ్లో అడవుల్లో మంటలు
- ;పూర్తిగా కాలిపోయిన 1500హెక్టార్ల అటవీ భూమి
- 10 మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest Fire : ఉత్తరాఖండ్లో అడవుల్లో మంటలు అదుపు తప్పుతున్నాయి. నవంబరు నుంచి దాదాపు వెయ్యికి పైగా అగ్ని ప్రమాద ఘటనల్లో పచ్చదనంతో నిండిన సుమారు 1500హెక్టార్ల అటవీ భూమి కాలిపోయి ధ్వంసమైంది. బిన్సార్తో సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు వైమానిక దళం హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నప్పటికీ మంటలను పూర్తిగా అదుపు చేయలేకపోయారు.
Read Also:Devara : రిలాక్స్ మోడ్ లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సెంటిమెంటే కారణం
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
నవంబర్ 2023 నుండి రాష్ట్రంలో 1,242 అటవీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,696 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ సంపద దెబ్బతిన్నది. అడవి మంటలను అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఏప్రిల్లో నైనిటాల్ జిల్లాకు చేరుకుంది. అదేవిధంగా మేలో కూడా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ గర్వాల్కు చేరుకుంది. రాష్ట్రంలో కుమావోన్ డివిజన్లో గరిష్టంగా 598, గర్వాల్ డివిజన్లో 532 వద్ద అటవీ మంటలు సంభవించాయి.
Read Also:Minister Narayana: అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..
వేడి పెరగడంతో అల్మోరా, రాణిఖేత్లలో మంటలు మళ్లీ అంటుకోవడం ప్రారంభమయ్యాయి. సాల్ట్ డెవలప్మెంట్ బ్లాక్లోని ఐటీఐ, విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవుల్లో ఇప్పుడు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. సాల్ట్ డెవలప్మెంట్ బ్లాక్లోని విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవులలో శనివారం కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోజంతా అడవి మండుతూనే ఉంది. కానీ పాలకసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదు. రోజంతా అడవులు మండుతూనే ఉన్నాయి. రాణిఖేత్లోని సౌనీ, రిచీ అడవులు కూడా మండుతూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?