UAE Attacks On Iran: ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ తిక్క కుదిర్చిన యూఏఈ..
- ఇరాన్పై మొదటిసారి దాడి చేసిన యూఏఈ..
- మధ్యప్రాచ్య దేశాల్లో ముదురుతున్న యుద్ధం..
- భయాందోళనలో ప్రపంచదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేడు ఇరాన్లోనికీలకమైన ‘డీశాలినేషన్ ప్లాంట్’పై దాడి చేసింది. ఈ ప్లాంట్ సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలైన ‘జెరూసలేం పోస్ట్’, ‘యెడియట్ అహరోనోత్’ ధృవీకరించాయి. గత కొంతకాలంగా ఇరాన్ చేస్తున్న డ్రోన్ , క్షిపణి దాడులకు యూఏఈ ఇలా నేరుగా సమాధానం చెప్పడం ఇదే మొదటిసారి.
Also Read:Prithvi Shaw Engagement: అకృతి అగర్వాల్ తో పృథ్వీ షా ఎంగేజ్మెంట్.. ఆమె ఎవరంటే?
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
అసలు ఏం జరిగింది..?
గత నెల 28వ తేదీ నుంచి ఇరాన్ వరుసగా యూఏఈని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న అబుదాబి, దుబాయ్ విమానాశ్రయాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనివల్ల అక్కడి విమాన రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా.. విమానాశ్రయ భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన యూఏఈ.. ఎప్పుడైనా తాము ఎదురుదాడికి దిగుతామని ముందే హెచ్చరించింది. అన్నట్టుగానే.. ఇరాన్ నీటి సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తూ ఈ భారీ దాడికి పాల్పడింది.
ప్రమాదంలో గల్ఫ్ దేశాలు..
కేవలం యూఏఈ మాత్రమే కాదు.. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. ఇరాన్ వైఖరి వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు, చమురు ఎగుమతులు దెబ్బతింటున్నాయని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ దేశాలన్నీ కలిసి ఇరాన్పై ఎదురుదాడికి దిగితే.. అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Also Read:Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
ప్రపంచవ్యాప్త ఆందోళన..
ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. మొత్తం మధ్యప్రాచ్యాన్ని ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం రణరంగాన్ని తలపిస్తోంది. యూఏఈ చేసిన ఈ మొదటి దాడితో.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు భయాందోళనలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!