Site icon NTV Telugu

Food Grain Prices : ద్రవ్యోల్బణం, రుతుపవనాల ఆలస్యం.. 15రోజుల్లో భారీగా పెరిగిన బియ్యం, పప్పు ధరలు

New Project

New Project

Food Grain Prices : రుతుపవనాలు మందగించడంతో ఖరీఫ్‌ పంటలు నాట్లు వేయడంలో జాప్యం నెలకొంది. దీని కారణంగా గత 15 రోజుల్లో బియ్యం, దాని సంబంధిత ఉత్పత్తులైన పోహా, పఫ్డ్ రైస్, జోవర్, బజ్రా, చికెన్ ధరలు 5 నుంచి 15 శాతం పెరిగాయి. ధరల నియంత్రణ వంటి ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఎలాంటి ప్రభావం చూపడం లేదు. దీని కారణంగా గోధుమలు, పప్పుల ధరలు కూడా అధిక స్థాయిలోనే ఉన్నాయి. వర్షాలు కురిసి నాట్లు వేసేందుకు అనుకూలంగా మారే వరకు ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also:Mega Princess: పాప జాతకం అధ్బుతం.. మనవరాలిపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పోహా, ముర్మురాలలో 15 శాతం పెరుగుదల
వరి, పప్పుధాన్యాలైన పెసర, మినుములు, కంది, నూనెగింజలు, వేరుశనగ, సోయాబీన్ వంటివి ఖరీఫ్ సీజన్‌లో పండించే ప్రధాన ఆహార ఉత్పత్తులు. జైరాజ్ గ్రూప్ డైరెక్టర్ రాజేష్ షా ఒక మీడియా నివేదిక ప్రకారం.. రుతుపవనాల ఆలస్యం కారణంగా బియ్యం, బియ్యం సంబంధిత ఉత్పత్తులైన పోహా, పఫ్డ్ రైస్ ధరలు గత రెండు వారాల్లో సుమారు 15 శాతం పెరిగాయి. జొన్నలు, సజ్జల ధరలు కూడా పెరిగాయి. పప్పులు, గోధుమల ధరలు తగ్గలేదు. సకాలంలో వర్షాలు కురవకపోతే ధాన్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Read Also:Uttarakhand : 100స్పీడుతో వెళ్తున్న బస్సులో తప్పతాగి పడిపోయిన డ్రైవర్.. ప్రజల ప్రాణాలు కాపాడిన సీఐఎస్‌ఎఫ్

పెరగనున్న పప్పుల ధరలు
రుతుపవనాలు 7-10 రోజులు మరింత ఆలస్యం కావడం వల్ల పప్పుధాన్యాల పంటల విస్తీర్ణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది మొత్తం పప్పుధాన్యాల ధరలు పెరగవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు. వరి వంటి ఇతర ప్రధాన పంటలకు, జూలైలో వర్షాలు సరిపోకపోతే వరి విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గవచ్చు. దీంతో పాటు ధరల్లో మరింత పెరుగుదల కనిపించవచ్చు. వేసవి ఆలస్యంగా రావడం, జూన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆలస్యమైన వర్షాలు పౌల్ట్రీ ఫామ్‌ల ఉత్పాదకతను తగ్గించాయి. ఇది చికెన్ ధరలను పెంచింది.

Exit mobile version