One Nation One Election: 2029 తర్వాతే జమిలి ఎన్నికలు: నిర్మలా సీతారామన్
- 2029 తర్వాతే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' ప్రక్రియ
- జమిలితో భారీ వ్యయం ఆదా అవుతుంది
- ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలిపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, జమిలితో ఈ భారీ వ్యయం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కాట్టాన్కొళత్తూరులోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శనివారం ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘2029 తర్వాతే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయి. ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అప్పుడు ప్రారంభిస్తేనే 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుంది. ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. పార్లమెం టుకు, శాసనసభకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ద్వారా ప్రజల సొమ్మును ఆదా చేయొచ్చు. 2024 లోక్సభ ఎన్నికలకు దాదాపు రూ.లక్ష కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే’ అని తెలిపారు.
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Also Read: Vijay Shankar: శంకరన్నా.. అందరూ నవ్వుకుంటున్నారే!
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై నిర్మాలసీతా రామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకదేశం ఒకే ఎన్నిక అనేది ఎవరి సోంత కార్యక్రమం కాదు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాకే ఈ నిర్ణయంపై ముందుకు వెళ్తాము. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం జమిలి వద్దు అంటూ కొన్ని పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి సైతం స్వీయ చరిత్రలో జమిలి ఎన్నికలకు మద్దతుగా రాశారు, మద్దతు ప్రకటించారు. కానీ ఆయన కోడుకు స్టాలిన్ మాత్రం తండ్రి మాటకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అంటున్నారు. రాజకీయం లద్ది కోసం స్టాలిన్ చేస్తున్న పనులు ప్రజలు గుర్తించాలి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..