Floods: ఉగ్రరూపం దాల్చిన నదులు.. వరదల్లో 55 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. భారీగా వర్షాలు పడుతున్న అసోంలో మరో 9 మంది మరణించగా వరదల ధాటికి.. రాష్ట్రం మొత్తం చనిపోయిన వారి సంఖ్య 55కు చేరింది. 28 రాష్ట్రాల్లోని దాదాపు 19 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర, బరాక్ వాటి ఉపనదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడికి లోయర్ అసోంలోని పలు ప్రాంతాలు మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.అసోంలోని సోనిత్పుర్లోనూ వరదలు పోటెత్తుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో నదుల కట్టలు తెగిపోతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర గణాంకాల ప్రకారం 2930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 43,338 హెక్టార్ల మేర పంట మునిగిపోయింది. వరదల ధాటికి ఒక్క అసోంలోనే ఇప్పటివరకు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 లక్షల మందికిపైగా తీవ్ర ప్రభావం చూపింది.రాజధాని గువాహటిలో 373 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా.. లక్ష మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క బజలి జిల్లాలోనే 3 లక్షల 50 వేలమంది కిపైగా వరద బాధితులుగా మారారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
వరద సహాయక చర్యల్లో భారత సైన్యం కూడా సేవలందిస్తోంది. ఆయా జిల్లాల అధికారుల విజ్ఞప్తి మేరకు గురువారం నుంచి సహాయచర్యల్లో భాగం పంచుకుంటోంది. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ల్లోనూ పరిస్థితులు అసోం కంటే భిన్నంగా ఏం లేవు. పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడగా.. రోడ్లు ధ్వంసమయ్యాయి. మేఘాలయలో 18 మంది చనిపోయారు.మేఘాలయలోని చిరపుంజిలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 972 మి.లీ. వర్షపాతం నమోదైంది. మౌసిన్రామ్లో 1003.6 మి.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు
మనుషులు సహా మూగజీవులు కూడా వరదల ధాటికి ఇబ్బందులు పడుతున్నాయి. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వరదల్లో వెదురుబొంగులు ఇతరత్రా వాటిని పడవలుగా మార్చుకొని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
India Corona: దేశంలో కరోనా కల్లోలం.. వరుసగా మూడోరోజు 12వేలకు పైగానే..
తాజావార్తలు
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
-
Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!