Site icon NTV Telugu

Floating Stone: గంగా నదిలో తేలుతున్న 2 క్వింటాళ్ల బరువున్న రాయి.. రామసేతుదేనట..!

Floating Stone

Floating Stone

Floating Stone: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గంగా నది నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న నీటి మట్టంలో చాలా వస్తువులు తేలుతూ వస్తున్నాయి. కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద ఒక రాయి తేలుతూ కనిపించింది. ఈ రాయి బరువు దాదాపు 2 క్వింటాళ్లు ఉంటుందని చెబుతున్నారు. చాలా మంది ఈ రాయిని ఎత్తలేకపోతున్నారు. ఇంత బరువు ఉన్నా.. ఆ రాయి గంగా నీటిలో మునిగిపోవడం లేదు. ఈ వార్త ఆ ప్రాంతంలో వ్యాపించింది. వెంటనే.. వందలాది మంది గంగా ఘాట్ వద్దకు చేరుకుని పూజించడం మొదలు పెట్టారు. అయితే కొంత మంది అక్కడ శ్లోకాలు పఠిస్తూ కూర్చున్నారు.

READ MORE: Samsung Galaxy F36: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ప్రీమియం లుక్స్‌తో మిడ్‌రేంజ్‌‍లో శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల..!

త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రం దాటవలసి వచ్చినప్పుడు.. వానర సైన్యం రామసేతును నిర్మించిందని చెబుతారు. రామసేతును నిర్మించిన రాళ్ళు నీటిలో మునిగిపోలేదు. ఆ సేతు నుంచి ఈరోజు ఘాజీపూర్‌లోని దాద్రి ఘాట్‌కు రాయి వచ్చిందని నమ్ముతున్నారు. ఆ రాయిని మొదట ఒక పిల్లాడు చూశాడు. ఘాట్ పక్కనే పడవల నడిపేవారికి సంబంధించిన కాలనీ ఉంది. ఆ కాలనీలో సోను అనే బాలుడు ఉన్నాడు. బాలుడి వయస్సు దాదాపు 10-15 సంవత్సరాలు. నిన్న మధ్యాహ్నం సోను గంగా నదిలో స్నానం చేస్తుండగా, ఘాట్ నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలో ఏదో తేలుతున్నట్లు చూశాడు. అక్కడికి చేరుకుని రాయి తేలుతున్నట్లు గమనించాడు. సోను ఆ రాయిని ఘాట్ ఒడ్డుకు తీసుకువచ్చి తాళ్లతో కట్టాడు. ఉదయం.. స్నానం చేయడానికి గంగా ఘాట్ వద్దకు చేరుకున్న భక్తులు గంగా నదిలో తేలుతున్నట్లు రాయికి పూజలు చేయడం ప్రారంభించారు.

READ MORE: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియాకు పైలట్ల సంఘం లీగల్ నోటీసు.. ఏముందంటే..!

Exit mobile version