Floating Stone: గంగా నదిలో తేలుతున్న 2 క్వింటాళ్ల బరువున్న రాయి.. రామసేతుదేనట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Floating Stone: ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో గంగా నది నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న నీటి మట్టంలో చాలా వస్తువులు తేలుతూ వస్తున్నాయి. కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద ఒక రాయి తేలుతూ కనిపించింది. ఈ రాయి బరువు దాదాపు 2 క్వింటాళ్లు ఉంటుందని చెబుతున్నారు. చాలా మంది ఈ రాయిని ఎత్తలేకపోతున్నారు. ఇంత బరువు ఉన్నా.. ఆ రాయి గంగా నీటిలో మునిగిపోవడం లేదు. ఈ వార్త ఆ ప్రాంతంలో వ్యాపించింది. వెంటనే.. వందలాది మంది గంగా ఘాట్ వద్దకు చేరుకుని పూజించడం మొదలు పెట్టారు. అయితే కొంత మంది అక్కడ శ్లోకాలు పఠిస్తూ కూర్చున్నారు.
Also Read
త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రం దాటవలసి వచ్చినప్పుడు.. వానర సైన్యం రామసేతును నిర్మించిందని చెబుతారు. రామసేతును నిర్మించిన రాళ్ళు నీటిలో మునిగిపోలేదు. ఆ సేతు నుంచి ఈరోజు ఘాజీపూర్లోని దాద్రి ఘాట్కు రాయి వచ్చిందని నమ్ముతున్నారు. ఆ రాయిని మొదట ఒక పిల్లాడు చూశాడు. ఘాట్ పక్కనే పడవల నడిపేవారికి సంబంధించిన కాలనీ ఉంది. ఆ కాలనీలో సోను అనే బాలుడు ఉన్నాడు. బాలుడి వయస్సు దాదాపు 10-15 సంవత్సరాలు. నిన్న మధ్యాహ్నం సోను గంగా నదిలో స్నానం చేస్తుండగా, ఘాట్ నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలో ఏదో తేలుతున్నట్లు చూశాడు. అక్కడికి చేరుకుని రాయి తేలుతున్నట్లు గమనించాడు. సోను ఆ రాయిని ఘాట్ ఒడ్డుకు తీసుకువచ్చి తాళ్లతో కట్టాడు. ఉదయం.. స్నానం చేయడానికి గంగా ఘాట్ వద్దకు చేరుకున్న భక్తులు గంగా నదిలో తేలుతున్నట్లు రాయికి పూజలు చేయడం ప్రారంభించారు.
READ MORE: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియాకు పైలట్ల సంఘం లీగల్ నోటీసు.. ఏముందంటే..!
उत्तर प्रदेश –
जिला गाजीपुर की गंगा में एक बड़ा पत्थर तैरता हुआ आ गया। वजन 2 कुंतल के आसपास है। न डूब रहा है, न किसी से उठ रहा है। लोगों ने रामसेतु के पत्थर से जोड़कर इसकी पूजा–अर्चना शुरू कर दी है। pic.twitter.com/FPihE4ayBj
— Sachin Gupta (@SachinGuptaUP) July 19, 2025
తాజావార్తలు
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
-
Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
-
AV Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్.. ‘నిజం కోసం పోరాటం ఆగదు’
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!