Fish Forming : చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. రకరకాల పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే మరిన్ని లాభాలను పొందవచ్చు..
అయితే చేపలను పెంచడానికి ముందుగా నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది..ఇక నీరు లేత ఆకుపచ్చ రంగుతో 28-32 డిగ్రీ ల సేం. గ్రే. ఉష్ణోగ్రత ,30-40సేం. మీ. పారదర్శకత కలిగి నీటిలో ఉండే ప్రాణవాయువు 5-8 పి. పి. ఎం., ఉండాలి. అలాగే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్, భాస్వరం, కూడా పరిమిత స్థాయిలో ఉండాలి.
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
చెరువు నీటిలో ప్రాణవాయువు తగ్గకుండా జాగ్రత్త పడాలి.నర్సరీ చెరువులో 8-10 సేం. మీ. పెరిగే వరకు 30-40 రోజుల పాటు పెంచి పెంపకం చెరువులో వదలాలి. పెంపకం చెరువులో 1.5 మీ. కు తగ్గకుండా ఉండాలి..
చెరువును సారవంతం చెయ్యడం చాలా ముఖ్యం.. అందుకోసం నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒక దాని తర్వాత మరొకటి వేయాలి… చేపలు మరీ వేడిని కూడా తట్టుకోలేవు.. అందుకే ఈ విషయం పై జాగ్రత్తలు తీసుకోవాలి..
ఇక చేపలకు మేతగా సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి.15 నుంచి 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించలి..చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి… అవసరం అనుకుంటే మందులను కూడా వాడాలి…
బాగా పెరిగిన చేప పిల్లలను సకాలంలో పట్టుకొని మార్కెట్ కు తరలించాలి..చేప కిలో సైజు పెరగడానికి 10-12 నేలలు పడుతుంది. వెదురు బుట్టలో ఐస్ తో ప్యాక్ చేసి వాటిని రవాణా చేస్తే చేపలు చెడిపోకుండా ఉంటాయి..
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!