Fish Forming : చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. రకరకాల పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే మరిన్ని లాభాలను పొందవచ్చు..
అయితే చేపలను పెంచడానికి ముందుగా నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది..ఇక నీరు లేత ఆకుపచ్చ రంగుతో 28-32 డిగ్రీ ల సేం. గ్రే. ఉష్ణోగ్రత ,30-40సేం. మీ. పారదర్శకత కలిగి నీటిలో ఉండే ప్రాణవాయువు 5-8 పి. పి. ఎం., ఉండాలి. అలాగే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్, భాస్వరం, కూడా పరిమిత స్థాయిలో ఉండాలి.
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
చెరువు నీటిలో ప్రాణవాయువు తగ్గకుండా జాగ్రత్త పడాలి.నర్సరీ చెరువులో 8-10 సేం. మీ. పెరిగే వరకు 30-40 రోజుల పాటు పెంచి పెంపకం చెరువులో వదలాలి. పెంపకం చెరువులో 1.5 మీ. కు తగ్గకుండా ఉండాలి..
చెరువును సారవంతం చెయ్యడం చాలా ముఖ్యం.. అందుకోసం నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒక దాని తర్వాత మరొకటి వేయాలి… చేపలు మరీ వేడిని కూడా తట్టుకోలేవు.. అందుకే ఈ విషయం పై జాగ్రత్తలు తీసుకోవాలి..
ఇక చేపలకు మేతగా సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి.15 నుంచి 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించలి..చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి… అవసరం అనుకుంటే మందులను కూడా వాడాలి…
బాగా పెరిగిన చేప పిల్లలను సకాలంలో పట్టుకొని మార్కెట్ కు తరలించాలి..చేప కిలో సైజు పెరగడానికి 10-12 నేలలు పడుతుంది. వెదురు బుట్టలో ఐస్ తో ప్యాక్ చేసి వాటిని రవాణా చేస్తే చేపలు చెడిపోకుండా ఉంటాయి..
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!