Fish Forming : చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. రకరకాల పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే మరిన్ని లాభాలను పొందవచ్చు..
అయితే చేపలను పెంచడానికి ముందుగా నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది..ఇక నీరు లేత ఆకుపచ్చ రంగుతో 28-32 డిగ్రీ ల సేం. గ్రే. ఉష్ణోగ్రత ,30-40సేం. మీ. పారదర్శకత కలిగి నీటిలో ఉండే ప్రాణవాయువు 5-8 పి. పి. ఎం., ఉండాలి. అలాగే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్, భాస్వరం, కూడా పరిమిత స్థాయిలో ఉండాలి.
Also Read
చెరువు నీటిలో ప్రాణవాయువు తగ్గకుండా జాగ్రత్త పడాలి.నర్సరీ చెరువులో 8-10 సేం. మీ. పెరిగే వరకు 30-40 రోజుల పాటు పెంచి పెంపకం చెరువులో వదలాలి. పెంపకం చెరువులో 1.5 మీ. కు తగ్గకుండా ఉండాలి..
చెరువును సారవంతం చెయ్యడం చాలా ముఖ్యం.. అందుకోసం నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒక దాని తర్వాత మరొకటి వేయాలి… చేపలు మరీ వేడిని కూడా తట్టుకోలేవు.. అందుకే ఈ విషయం పై జాగ్రత్తలు తీసుకోవాలి..
ఇక చేపలకు మేతగా సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి.15 నుంచి 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించలి..చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి… అవసరం అనుకుంటే మందులను కూడా వాడాలి…
బాగా పెరిగిన చేప పిల్లలను సకాలంలో పట్టుకొని మార్కెట్ కు తరలించాలి..చేప కిలో సైజు పెరగడానికి 10-12 నేలలు పడుతుంది. వెదురు బుట్టలో ఐస్ తో ప్యాక్ చేసి వాటిని రవాణా చేస్తే చేపలు చెడిపోకుండా ఉంటాయి..
తాజావార్తలు
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?