Jammu Kashmir: అర్నియా సెక్టార్లో కాల్పులు.. ఒక జవాన్, నలుగురు పౌరులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూలోని అర్నియా సెక్టార్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పోస్ట్పై గురువారం రాత్రి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది. దీంతో భారత సైనికులు వారికి తగిన సమాధానం ఇస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బీఎస్ఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో BSF పోస్ట్పై మోర్టార్ దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. జమ్మూలోని 5 భారత పోస్టులపై పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్, నలుగురు పౌరులు గాయపడ్డారు. 9 రోజుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి. అక్టోబర్ 17న అర్నియా సెక్టార్లో పాకిస్తాన్ రేంజర్లు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపారు, ఇందులో ఇద్దరు BSF జవాన్లు గాయపడ్డారు.
Read Also:TTD Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీటీడీ లో భారీగా ఉద్యోగాలు.. రూ. లక్షన్నర జీతం..
Also Read
- Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ఆర్నియాలో కాల్పుల అనంతరం 50 మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ నిరంతరం ఉల్లంఘిస్తూ మోర్టార్లను ప్రయోగిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా బలగాలు గురువారం చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ రేంజర్లు జరిపిన కాల్పులకు సైనికులు ధీటుగా సమాధానం ఇచ్చారు. జమ్మూలోని అర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని భారత పోస్టులపై పాకిస్థాన్ రేంజర్లు గురువారం రాత్రి అకారణంగా కాల్పులు జరిపారు. భారత సైనికులు తగిన సమాధానం ఇస్తున్నారని అధికారి తెలిపారు.
Read Also:Telangana Elections 2023: మహబూబాబాద్,వర్ధన్నపేట లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన..
రాత్రి 8 గంటల ప్రాంతంలో పాక్ సైనికుల కాల్పులు ప్రారంభమయ్యాయని బీఎస్ఎఫ్ తెలిపింది. బీఎస్ఎఫ్ జవాన్లు తగిన రెస్పాన్స్ ఇస్తున్నారని తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ గాయపడినట్లు సమాచారం. కొంతమంది పౌరులకు గాయాల గురించి సమాచారం కూడా వెలుగులోకి వస్తోంది, అయితే దీనికి అధికారిక ధృవీకరణ లేదు. బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!